ETV Bharat / state

VIJAYAWADA KANAKADURGA TEMPLE: నేడు గాయత్రీదేవి రూపంలో దర్శనమివ్వనున్న బెజవాడ దుర్గమ్మ

author img

By

Published : Oct 9, 2021, 7:48 AM IST

దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా విజయవాడ కనకదుర్గమ్మ మూడో రోజైన నేడు గాయత్రీదేవి రూపంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. వేకువజామున 4 గంటల నుంచే అమ్మవారి దర్శనం ప్రారంభమైంది. రాత్రి 10 గంటల వరకు భక్తలు గాయత్రీదేవిని దర్శించుకోవచ్చని ఆలయ అర్చకులు చెబుతున్నారు.

third-day-devi-navarathri-celebrations-at-vijayawada-kanakadurga-temple
నేడు గాయత్రీదేవి రూపంలో దర్శనమివ్వనున్న బెజవాడ దుర్గమ్మ

దసరా శరన్నవరాత్రోత్సవాల్లో భాగంగా మూడో రోజు అమ్మవారు గాయత్రీదేవి రూపంలో భక్తులకు దర్శనం ఇవ్వనుంది. సకల మంత్రాలకూ మూలమైన శక్తిగా, వేదమాతగా ప్రసిద్ధిపొంది ముక్తా, విద్రుమ, హేమ, నీల, దవళ వర్ణాలతో ప్రకాశించే పంచముఖాలతో దర్శనమిచ్చే సంధ్యావందన దేవత గాయత్రీదేవి. ఈ తల్లి శిరస్సుపై బ్రహ్మ, హృదయములో విష్ణువు, శిఖలో రుద్రుడు నివసిస్తుండగా.. త్రిమూర్త్యాంశగా గాయత్రీదేవి వెలుగొందుతుంది. సమస్త దేవతా మంత్రాలకూ గాయత్రీ మంత్రంతో అనుబంధం ఉంది. గాయత్రీ మంత్రంతో సంప్రోక్షణ చేసిన తరువాతే ఆయా దేవతలకు అన్నాదులు, ప్రసాదాలు నివేదన చేస్తారు. గాయత్రీ అమ్మవారిని దర్శించుకోవడం వల్ల ఆరోగ్యం, సకల మంత్రసిద్ధి, తేజస్సు, జ్ఞానం పొందుతారు. దర్శనం ఉదయం 4గంటల నుంచి రాత్రి 10గంటల వరకు ఉంటుంది.

నేడు గాయత్రీదేవి రూపం..

సమేత దుర్గామల్లేశ్వర స్వామివార్ల ఉత్సవమూర్తులు

దుర్గగుడి దసరా ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. రెండో రోజు తరలివచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు పర్యవేక్షించారు. భక్తుల సేవా టిక్కెట్లు, ప్రసాద విక్రయాల ద్వారా రూ.17.70లక్షల ఆదాయం రెండో రోజు సమకూరినట్టు ఆలయ ఈవో డి.భ్రమరాంబ వెల్లడించారు. ఉదయం నుంచే భక్తులు తరలిరావడంతో ఇంద్రకీలాద్రి పరిసరాలు కిక్కిరిసిపోయాయి. బాలాత్రిపుర సుందరీదేవి రూపాన్ని కుమారీలుగా పిలిచే బాలికల ప్రతిరూపంగా భావిస్తారని ఈవో అన్నారు. అందుకే ఆలయం తరఫున బాలికలకు శుక్రవారం సువాసిని పూజలు నిర్వహించినట్టు వెల్లడించారు.

ఆలయ పరిసరాల్లో ఊరేగుతున్న గంగా పార్వతీ
సువాసినీ పూజలో..
కుంకుమార్చనలో..
క్యూలైన్లలో కిక్కిరిసిన భక్తులు

ఇదీ చూడండి: HAMSA VAHANA SEVA : తిరుమలలో వైభవంగా హంస వాహన సేవ

దసరా శరన్నవరాత్రోత్సవాల్లో భాగంగా మూడో రోజు అమ్మవారు గాయత్రీదేవి రూపంలో భక్తులకు దర్శనం ఇవ్వనుంది. సకల మంత్రాలకూ మూలమైన శక్తిగా, వేదమాతగా ప్రసిద్ధిపొంది ముక్తా, విద్రుమ, హేమ, నీల, దవళ వర్ణాలతో ప్రకాశించే పంచముఖాలతో దర్శనమిచ్చే సంధ్యావందన దేవత గాయత్రీదేవి. ఈ తల్లి శిరస్సుపై బ్రహ్మ, హృదయములో విష్ణువు, శిఖలో రుద్రుడు నివసిస్తుండగా.. త్రిమూర్త్యాంశగా గాయత్రీదేవి వెలుగొందుతుంది. సమస్త దేవతా మంత్రాలకూ గాయత్రీ మంత్రంతో అనుబంధం ఉంది. గాయత్రీ మంత్రంతో సంప్రోక్షణ చేసిన తరువాతే ఆయా దేవతలకు అన్నాదులు, ప్రసాదాలు నివేదన చేస్తారు. గాయత్రీ అమ్మవారిని దర్శించుకోవడం వల్ల ఆరోగ్యం, సకల మంత్రసిద్ధి, తేజస్సు, జ్ఞానం పొందుతారు. దర్శనం ఉదయం 4గంటల నుంచి రాత్రి 10గంటల వరకు ఉంటుంది.

నేడు గాయత్రీదేవి రూపం..

సమేత దుర్గామల్లేశ్వర స్వామివార్ల ఉత్సవమూర్తులు

దుర్గగుడి దసరా ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. రెండో రోజు తరలివచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు పర్యవేక్షించారు. భక్తుల సేవా టిక్కెట్లు, ప్రసాద విక్రయాల ద్వారా రూ.17.70లక్షల ఆదాయం రెండో రోజు సమకూరినట్టు ఆలయ ఈవో డి.భ్రమరాంబ వెల్లడించారు. ఉదయం నుంచే భక్తులు తరలిరావడంతో ఇంద్రకీలాద్రి పరిసరాలు కిక్కిరిసిపోయాయి. బాలాత్రిపుర సుందరీదేవి రూపాన్ని కుమారీలుగా పిలిచే బాలికల ప్రతిరూపంగా భావిస్తారని ఈవో అన్నారు. అందుకే ఆలయం తరఫున బాలికలకు శుక్రవారం సువాసిని పూజలు నిర్వహించినట్టు వెల్లడించారు.

ఆలయ పరిసరాల్లో ఊరేగుతున్న గంగా పార్వతీ
సువాసినీ పూజలో..
కుంకుమార్చనలో..
క్యూలైన్లలో కిక్కిరిసిన భక్తులు

ఇదీ చూడండి: HAMSA VAHANA SEVA : తిరుమలలో వైభవంగా హంస వాహన సేవ

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.