కృష్ణాజిల్లా అవనిగడ్డ,ఎడ్ల లంక మండలాల్లోని ముంపు ప్రాంతాల్లో రాష్ట్ర మంత్రులు పర్యటించారు. మోకాలు లోతు నీళ్లు రావడంతో పాటు ప్రవాహ వేగం ఎక్కువగా ఉండటంతో మంత్రులు ట్రాక్టర్లో పరిస్థితిని పర్యవేక్షించారు. మంత్రులు కొడాలి వెంకటేశ్వరరావు, పేర్ని వెంకట్రామయ్య,అనిల్ కుమార్ యాదవ్ తో పాటు స్థానిక ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబులు ట్రాక్టర్పై వెళ్లి బాధితులను పరామర్శించారు. ఈ గ్రామాల్లో ఇప్పటికే కొన్ని కుటుంబాలను అధికారులు పునరావాస కేంద్రాలకు తరలించారు.
ఇదీ చూడండి: 48 రోజుల తర్వాత 40 ఏళ్ల విశ్రాంతికి స్వామివారు!