ETV Bharat / state

దారుణం: కుమారుడి దాడిలో తల్లి మృతి

author img

By

Published : Dec 30, 2020, 5:35 AM IST

Updated : Dec 30, 2020, 7:02 AM IST

murder in krishna district
murder in krishna district

05:33 December 30

కృష్ణా జిల్లా నాగాయలంక మండలం ఎదురుమొండిలో దారుణం జరిగింది. కనిపెంచిన తల్లిదండ్రులపైనే గొడ్డలితో దాడి చేశాడు ఓ వ్యక్తి. ఘటనలో అతని తల్లి మరణించింది.  స్థానికుల కథనం ప్రకారం... గ్రామానికి చెందిన నాగేశ్వరరావు, వీరలంకమ్మ దంపతులపై వారి కుమారుడు వీరరాఘవయ్య గొడ్డలితో విచక్షణా రహితంగా దాడి చేశాడు.

వీరలంకమ్మ మృతి చెందగా... నాగేశ్వరరావుకు తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రుడిని ఆసుపత్రికి తరలించారు. భార్యతో గొడవల కారణంగానే తల్లిదండ్రులపై కుమారుడు దాడి చేశాడని స్థానికులు చెబుతున్నారు. అవనిగడ్డ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి:

రాజమహేంద్రవరానికి చెందిన మహిళకు స్ట్రెయిన్ నిర్ధరణ

05:33 December 30

కృష్ణా జిల్లా నాగాయలంక మండలం ఎదురుమొండిలో దారుణం జరిగింది. కనిపెంచిన తల్లిదండ్రులపైనే గొడ్డలితో దాడి చేశాడు ఓ వ్యక్తి. ఘటనలో అతని తల్లి మరణించింది.  స్థానికుల కథనం ప్రకారం... గ్రామానికి చెందిన నాగేశ్వరరావు, వీరలంకమ్మ దంపతులపై వారి కుమారుడు వీరరాఘవయ్య గొడ్డలితో విచక్షణా రహితంగా దాడి చేశాడు.

వీరలంకమ్మ మృతి చెందగా... నాగేశ్వరరావుకు తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రుడిని ఆసుపత్రికి తరలించారు. భార్యతో గొడవల కారణంగానే తల్లిదండ్రులపై కుమారుడు దాడి చేశాడని స్థానికులు చెబుతున్నారు. అవనిగడ్డ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి:

రాజమహేంద్రవరానికి చెందిన మహిళకు స్ట్రెయిన్ నిర్ధరణ

Last Updated : Dec 30, 2020, 7:02 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.