ETV Bharat / state

పానీపూరి బండిని ఢీకొట్టిన బైక్.. నలుగురికి తీవ్రగాయాలు

పానీపూరి బండిని ద్విచక్రవాహనం ఢీకొన్న ప్రమాదంలో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. కృష్ణా జిల్లా ఇబ్రహింపట్నం వద్ద ఈ ప్రమాదం జరిగింది.

author img

By

Published : Sep 7, 2021, 9:55 AM IST

road accident in inbraheempatnam
road accident in inbraheempatnam

కృష్ణాజిల్లా ఇబ్రహీంపట్నం వద్ద రోడ్డు ప్రమాదంలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానిక వడ్డే నగర్​కు చెందిన గోపాల్, కోటయ్య నగర్​కు చెందిన సాగర్, నరసయ్య ఖిల్లా రోడ్డు సెంటర్ నుంచి ద్విచక్ర వాహనంపై బీ కాలనీ వైపు వెళ్తున్నారు. ఈ క్రమంలో ఎదురుగా వస్తున్న పానీపూరి బండిని ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. గోపాల్, సాగర్​తో పాటు పానీపూరి బండి యజమాని నిఖిలేష్ పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం స్థానికులు 108లో విజయవాడ ఆసుపత్రికి తరలించారు. ఇబ్రహీంపట్నం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

కృష్ణాజిల్లా ఇబ్రహీంపట్నం వద్ద రోడ్డు ప్రమాదంలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానిక వడ్డే నగర్​కు చెందిన గోపాల్, కోటయ్య నగర్​కు చెందిన సాగర్, నరసయ్య ఖిల్లా రోడ్డు సెంటర్ నుంచి ద్విచక్ర వాహనంపై బీ కాలనీ వైపు వెళ్తున్నారు. ఈ క్రమంలో ఎదురుగా వస్తున్న పానీపూరి బండిని ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. గోపాల్, సాగర్​తో పాటు పానీపూరి బండి యజమాని నిఖిలేష్ పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం స్థానికులు 108లో విజయవాడ ఆసుపత్రికి తరలించారు. ఇబ్రహీంపట్నం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి: Rahul Murder Case: పోలీస్‌ కస్టడీకి నిందితుడు కోరాడ విజయ్‌కుమార్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.