ETV Bharat / state

విచారణకు హాజరుకాని వైకాపా నేత పీవీపీ... పోలీసుల ప్రత్యేక నిఘా

తెలంగాణలోని బంజారాహిల్స్ పోలీసులు వైకాపా నేత పొట్లూరి వరప్రసాద్( పీవీపీ)కు ఓ కేసు విషయంలో నోటీసులిచ్చారు. కానీ ఆయన విచారణకు హాజరుకాలేదు. దీంతో ఆయన కదలికలపై పోలీసులు నిఘా పెట్టారు.

author img

By

Published : Jun 26, 2020, 10:13 AM IST

Updated : Jun 26, 2020, 10:24 AM IST

PVP absent  at telangana  police inquiry
వైకాపా నేత పొట్లూరి వరప్రసాద్

తెలంగాణలోని హైదరాబాద్​ బంజారాహిల్స్ పోలీసులు వైకాపా నేత పొట్లూరి వరప్రసాద్( పీవీపీ)కు నోటీసులిచ్చారు. కానీ ఆయన విచారణకు హాజరుకాలేదు. దీంతో ఆయన కదలికలపై నిఘా పెట్టిన పోలీసులు ఇంట్లోనే ఉన్నట్లు గుర్తించారు. పోలీసు సిబ్బందిని ఫిలీంనగర్​లోని నివాసం వద్ద కాపలాగా ఉంచారు.

బంజారాహిల్స్​లో రోడ్ నెంబర్ 14లో నిర్మించిన విల్లాలోని ఒకదాన్ని ఏడాదిన్నర క్రితం పీవీపీ.. విక్రమ్ కైలాశ్​కు విక్రయించారు. ఇంటిపై భాగంలో నిర్మాణాలు చేపడుతుండగా పీవీపీతోపాటు 15 మంది అనుచరులు వెళ్లి అడ్డుకున్నారు.

బాధితుడి ఫిర్యాదుతో పోలీసులుకేసు నమోదు చేశారు. పీవీపీని 24వ తేదీన అదుపులోకి తీసుకుని రాత్రి 10: 30 గంటల వరకు విచారించారు. మరుసటి రోజు కూడా విచారణకు రావాలని నోటీసులు జారీ చేసినా ఆయన వెళ్లలేదు.

ఇదీ చూడండి. వాట్సాప్​తో సైబర్ నేరగాళ్ల మోసాలు

తెలంగాణలోని హైదరాబాద్​ బంజారాహిల్స్ పోలీసులు వైకాపా నేత పొట్లూరి వరప్రసాద్( పీవీపీ)కు నోటీసులిచ్చారు. కానీ ఆయన విచారణకు హాజరుకాలేదు. దీంతో ఆయన కదలికలపై నిఘా పెట్టిన పోలీసులు ఇంట్లోనే ఉన్నట్లు గుర్తించారు. పోలీసు సిబ్బందిని ఫిలీంనగర్​లోని నివాసం వద్ద కాపలాగా ఉంచారు.

బంజారాహిల్స్​లో రోడ్ నెంబర్ 14లో నిర్మించిన విల్లాలోని ఒకదాన్ని ఏడాదిన్నర క్రితం పీవీపీ.. విక్రమ్ కైలాశ్​కు విక్రయించారు. ఇంటిపై భాగంలో నిర్మాణాలు చేపడుతుండగా పీవీపీతోపాటు 15 మంది అనుచరులు వెళ్లి అడ్డుకున్నారు.

బాధితుడి ఫిర్యాదుతో పోలీసులుకేసు నమోదు చేశారు. పీవీపీని 24వ తేదీన అదుపులోకి తీసుకుని రాత్రి 10: 30 గంటల వరకు విచారించారు. మరుసటి రోజు కూడా విచారణకు రావాలని నోటీసులు జారీ చేసినా ఆయన వెళ్లలేదు.

ఇదీ చూడండి. వాట్సాప్​తో సైబర్ నేరగాళ్ల మోసాలు

Last Updated : Jun 26, 2020, 10:24 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.