ETV Bharat / state

సింధుతో పాటు.. క్రీడాకారులకు గవర్నర్ ఘన సన్మానం - gannavaram international airport

బ్యాడ్మింటన్ క్రీడాకారులు పీవీ సింధు, సాత్విక్ సాయిరాజ్, మహిళల హాకీ జట్టు సభ్యురాలు రజనిలను గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ సన్మానించారు. రాబోయే రోజుల్లో మరిన్ని పతకాలు సాధించాలని కోరారు. అనంతరం డీజీపీ గౌతం సవాంగ్​ను పీవీ.సింధు కలిశారు.

క్రీడాకారులను సన్మానించిన గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్
క్రీడాకారులను సన్మానించిన గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్
author img

By

Published : Aug 13, 2021, 3:35 PM IST

Updated : Aug 14, 2021, 6:20 AM IST

టోక్యో ఒలింపిక్స్​లో కాంస్య పతకం సాధించిన బ్యాడ్మింటన్ స్టార్ పి.వి. సింధు, మహిళల హాకీ జట్టు సభ్యురాలు రజని, బ్యాడ్మింటన్ డబుల్స్ క్రీడాకారుడు సాత్విక్ సాయిరాజులు గవర్నర్​ను కలిశారు. విజయవాడలోని రాజ్ భవన్​లో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్​తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు.

అనంతరం ముగ్గురు క్రీడాకారులను గవర్నర్ ఘనంగా సత్కరించారు. సింధు గెలిచిన పతకాన్ని వీక్షించారు. రాబోయే రోజుల్లో మరిన్ని పతకాలు సాధించాలని గవర్నర్ హరిచందన్ కోరారు. అంతకుముందు హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం చేరుకున్న సింధుకు.. క్రీడాభిమానులు, అధికారులు ఘన స్వాగతం పలికారు.

క్రీడాకారులను సన్మానించిన గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్

విజయవాడలో డీజీపీ గౌతం సవాంగ్‌ను పీవీ సింధు కలిశారు. ఒలింపిక్స్‌లో కాంస్యం గెలిచిన సింధును డీజీపీ, అధికారులు సత్కరించారు. సింధు విజయం యువత, మహిళలకు ప్రేరణ, స్ఫూర్తి కలిగించిందని డీజీపీ అన్నారు. మహిళల కోసం ప్రభుత్వం, పోలీసుశాఖ చేస్తున్న కృషిని సింధు అభినందించారు. ప్రతి మహిళ దిశ యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవాలని కోరారు.

ఇదీ చదవండి:

TDP COMPLAINT: 12 రోజుల్లోనే 50 ఖాళీ జీవోలు ఎందుకిచ్చారు: తెదేపా

టోక్యో ఒలింపిక్స్​లో కాంస్య పతకం సాధించిన బ్యాడ్మింటన్ స్టార్ పి.వి. సింధు, మహిళల హాకీ జట్టు సభ్యురాలు రజని, బ్యాడ్మింటన్ డబుల్స్ క్రీడాకారుడు సాత్విక్ సాయిరాజులు గవర్నర్​ను కలిశారు. విజయవాడలోని రాజ్ భవన్​లో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్​తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు.

అనంతరం ముగ్గురు క్రీడాకారులను గవర్నర్ ఘనంగా సత్కరించారు. సింధు గెలిచిన పతకాన్ని వీక్షించారు. రాబోయే రోజుల్లో మరిన్ని పతకాలు సాధించాలని గవర్నర్ హరిచందన్ కోరారు. అంతకుముందు హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం చేరుకున్న సింధుకు.. క్రీడాభిమానులు, అధికారులు ఘన స్వాగతం పలికారు.

క్రీడాకారులను సన్మానించిన గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్

విజయవాడలో డీజీపీ గౌతం సవాంగ్‌ను పీవీ సింధు కలిశారు. ఒలింపిక్స్‌లో కాంస్యం గెలిచిన సింధును డీజీపీ, అధికారులు సత్కరించారు. సింధు విజయం యువత, మహిళలకు ప్రేరణ, స్ఫూర్తి కలిగించిందని డీజీపీ అన్నారు. మహిళల కోసం ప్రభుత్వం, పోలీసుశాఖ చేస్తున్న కృషిని సింధు అభినందించారు. ప్రతి మహిళ దిశ యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవాలని కోరారు.

ఇదీ చదవండి:

TDP COMPLAINT: 12 రోజుల్లోనే 50 ఖాళీ జీవోలు ఎందుకిచ్చారు: తెదేపా

Last Updated : Aug 14, 2021, 6:20 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.