ETV Bharat / state

'నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.35 వేలు ఇవ్వండి'

author img

By

Published : Dec 2, 2020, 4:40 PM IST

Updated : Dec 3, 2020, 2:40 AM IST

నివర్‌ తుపాన్‌ వల్ల నష్టపోయిన రైతులకు ప్రభుత్వం 35 వేల రూపాయల చొప్పున పరిహారం ఇవ్వాలని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ డిమాండ్‌ చేశారు. ముందస్తు సాయంగా రెండ్రోజుల్లో 10 వేలు ఇవ్వాలన్నారు. గుంటూరు, కృష్ణా జిల్లాల్లో దెబ్బతిన్న పొలాలను పరిశీలించిన పవన్ కౌలు రైతులను ఆదుకోకపోతే రాష్ట్రవ్యాప్త ఉద్యమం చేపడతామన్నారు..

'నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.25 నుంచి 30 వేలు ఇవ్వండి'
'నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.25 నుంచి 30 వేలు ఇవ్వండి'

కౌలు రైతుల కోసం ఎలాంటి పోరాటానికైనా సిద్ధమే: పవన్

రాష్ట్రంలో తుపాన్లతో పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి కనీసం పాతిక వేల పరిహారం ఇవ్వాలని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వరదల్లో నష్టపోయిన రైతులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని.. కౌలు రైతులను పూర్తిగా విస్మరించారని ఆరోపించారు. భూ యజమానులతో సమానంగా కౌలు రైతులకు పరిహారం ఇవ్వాలని, లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేస్తామని హెచ్చరించారు.

నివర్ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో జనసేనాని పవన్ కల్యాణ్ పర్యటించారు. హైదరాబాద్ నుంచి విమానంలో గన్నవరం చేరుకున్న పవన్​కు పార్టీ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి పార్టీ నేత నాదెండ్ల మనోహర్ సహా నియోజకవర్గ ఇన్​ఛార్జ్​లు, కార్యకర్తలు ర్యాలీలో పాల్గొన్నారు. ముందుగా పెనమలూరు నియోజకవర్గంలో నష్టపోయిన పంటలను పవన్ పరిశీలించారు. ఉయ్యూరులో నీట మునిగిన వరి పొలాన్ని పరిశీలించి రైతుల కష్టాలు తెలుసుకున్నారు. పవన్ కల్యాణ్​ను కలసిన రైతులు నష్టపోయిన పంటలను చూపించారు. తమ కష్టాలను పవన్​తో చెప్పుకొన్నారు. నివర్ తుపానుతో రైతన్నలు తీవ్రంగా నష్టపోయారని.. అన్నం పెట్టే రైతు కన్నీరు కారుస్తున్నారని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు.

పవన్​ను కలిసిన వైకాపా ఎమ్మెల్యే తండ్రి

పెద్దపూడి అడ్డ రోడ్డు వద్ద పవన్ కల్యాణ్​ను వైకాపా ఎమ్మెల్యే పార్థసారథి తండ్రి, మాజీ ఎంపీ కె.పి.రెడ్డయ్య కలిశారు. తుపానుతో రైతులు చాలా దారుణంగా నష్టపోయారని.. ఏ ప్రభుత్వం రైతులను పట్టించుకోవడం లేదని పవన్​కు తెలిపారు. ప్రభుత్వం నమోదు చేస్తున్న పంట నష్టం అంచనాలు.. అంతా తప్పులేనని, ప్రస్తుతం చేస్తుందంతా మోసమే అన్నారు. ఏ ప్రభుత్వం వచ్చినా రైతులకు న్యాయం జరగడం లేదన్న కె.పి.రెడ్డయ్య.. రైతులకు న్యాయం జరిగేలా ప్రభుత్వంపై పోరాడాలని పవన్​ను కోరారు.

ప్రభుత్వం పట్టించుకోవడం లేదు

అనంతరం పామర్రు, చల్లపల్లి, అవనిగడ్డ నియోజకవర్గాల్లో పంట నష్టపోయిన ప్రాంతాల్లో పొలాల్లోకి దిగి పంటల పరిస్థితిని పవన్ పరిశీలించారు. ఎకరాకు ౩౦వేల వరకు ఖర్చు పెట్టామని.. నివర్ తుపానుతో సర్వం నష్ట పోయామని కౌలు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికీ పొలాల్లోంచి నీరు బయటకుపోలేదని.. తమకు ప్రభుత్వం సాయం అందించడం లేదని వాపోయారు. వైకాపానేతలు ఎవరూ పట్టించుకోవడం లేదని ఫిర్యాదు చేశారు.

రాష్ట్ర వ్యాప్త ఉద్యమం చేస్తాం

హైదరాబాద్​లో వరదల సమయంలో.. అక్కడి ప్రభుత్వం ఇంటికి 10 వేలు పరిహారం ఇచ్చింది. ఇక్కడ ఎకరా పొలం మునిగితే అంతే మొత్తం ఇస్తున్నారు. తుపానుతో రైతులందరూ తీవ్రంగా నష్ట పోయారు. ప్రభుత్వం ఇస్తోన్న పరిహారం రైతులకు ఏ మాత్రం సరిపోవడం లేదు. వైకాపా ప్రభుత్వంలో రైతులందరికీ న్యాయం జరగడం లేదు. కౌలు రైతులను ప్రభుత్వం అసలు పట్టించుకోవడం లేదు. ప్రతి రైతుకూ ఎకరాకు 25 నుంచి ౩౦ వేల పరిహారం ఇవ్వాలి. పొలం యజమానులుతో పాటు కౌలు రైతులందరికీ పరిహారం ఇవ్వాలి. రైతులకు పరిహారం పెంచకపోతే రాష్ట్రవ్యాప్త ఉద్యమం చేస్తాం. - పవన్ కల్యాణ్, జనసేన అధినేత

బర్త్​ డే పార్టీలకు వెళ్తే కరోనా రాదా?

అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న తీరుపై పవన్ కల్యాణ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. అసెంబ్లీ.. బూతులు తిట్టుకోవడం కోసం కాదని.. రైతుల సమస్యల పరిష్కారంపై చర్చలు జరపాలన్నారు. కరోనా పేరుతో అధికార పార్టీ నేతలు రైతులను కనీసం పరామర్శించలేదన్న పవన్... కరోనా ఉన్నా బర్త్ డే పార్టీలు మాత్రం చేసుకుంటున్నారన్నారు. కృష్ణా జిల్లాలో 2.5లక్షల ఎకరాల పంటనష్టం జరిగిందని.. రైతులకు తక్షణ సహాయంగా 5-10 వేలు వెంటనే ఇవ్వాలన్నారు. ఇద్దరు కౌలు రైతులు ఆత్మహత్య చేసుకున్నారని..వారి కుటుంబానికి 5లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కౌలు రైతులను పట్టించుకోకపోతే.. ఏ స్థాయి పోరాటం చేసేందుకైనా సిద్ధమేనని పవన్ స్పష్టం చేశారు. నిపుణులతో మాట్లాడి అంచనాలు రూపొందించి.. సాయం కోసం కేంద్రానికి నివేదిక పంపిస్తామన్నారు.

పరిహారం అందించడంలో పార్టీల పేరుతో పక్షపాతం వహించొద్దని పవన్ సూచించారు. రైతులందరికీ పరిహారం అందించాలన్నారు. ఒక్కో పంటకు ఒక్కో విధమైన పర్సెంటేజీలు, గ్రేడింగ్ లేకుండా పరిహారం కోసం అంచనాలు నమోదు చేయాలన్నారు.

ఇదీ చదవండి:

జనసేనానిని కలిసిన వైకాపా ఎమ్మెల్యే పార్థసారథి తండ్రి రెడ్డయ్య

కౌలు రైతుల కోసం ఎలాంటి పోరాటానికైనా సిద్ధమే: పవన్

రాష్ట్రంలో తుపాన్లతో పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి కనీసం పాతిక వేల పరిహారం ఇవ్వాలని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వరదల్లో నష్టపోయిన రైతులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని.. కౌలు రైతులను పూర్తిగా విస్మరించారని ఆరోపించారు. భూ యజమానులతో సమానంగా కౌలు రైతులకు పరిహారం ఇవ్వాలని, లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేస్తామని హెచ్చరించారు.

నివర్ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో జనసేనాని పవన్ కల్యాణ్ పర్యటించారు. హైదరాబాద్ నుంచి విమానంలో గన్నవరం చేరుకున్న పవన్​కు పార్టీ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి పార్టీ నేత నాదెండ్ల మనోహర్ సహా నియోజకవర్గ ఇన్​ఛార్జ్​లు, కార్యకర్తలు ర్యాలీలో పాల్గొన్నారు. ముందుగా పెనమలూరు నియోజకవర్గంలో నష్టపోయిన పంటలను పవన్ పరిశీలించారు. ఉయ్యూరులో నీట మునిగిన వరి పొలాన్ని పరిశీలించి రైతుల కష్టాలు తెలుసుకున్నారు. పవన్ కల్యాణ్​ను కలసిన రైతులు నష్టపోయిన పంటలను చూపించారు. తమ కష్టాలను పవన్​తో చెప్పుకొన్నారు. నివర్ తుపానుతో రైతన్నలు తీవ్రంగా నష్టపోయారని.. అన్నం పెట్టే రైతు కన్నీరు కారుస్తున్నారని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు.

పవన్​ను కలిసిన వైకాపా ఎమ్మెల్యే తండ్రి

పెద్దపూడి అడ్డ రోడ్డు వద్ద పవన్ కల్యాణ్​ను వైకాపా ఎమ్మెల్యే పార్థసారథి తండ్రి, మాజీ ఎంపీ కె.పి.రెడ్డయ్య కలిశారు. తుపానుతో రైతులు చాలా దారుణంగా నష్టపోయారని.. ఏ ప్రభుత్వం రైతులను పట్టించుకోవడం లేదని పవన్​కు తెలిపారు. ప్రభుత్వం నమోదు చేస్తున్న పంట నష్టం అంచనాలు.. అంతా తప్పులేనని, ప్రస్తుతం చేస్తుందంతా మోసమే అన్నారు. ఏ ప్రభుత్వం వచ్చినా రైతులకు న్యాయం జరగడం లేదన్న కె.పి.రెడ్డయ్య.. రైతులకు న్యాయం జరిగేలా ప్రభుత్వంపై పోరాడాలని పవన్​ను కోరారు.

ప్రభుత్వం పట్టించుకోవడం లేదు

అనంతరం పామర్రు, చల్లపల్లి, అవనిగడ్డ నియోజకవర్గాల్లో పంట నష్టపోయిన ప్రాంతాల్లో పొలాల్లోకి దిగి పంటల పరిస్థితిని పవన్ పరిశీలించారు. ఎకరాకు ౩౦వేల వరకు ఖర్చు పెట్టామని.. నివర్ తుపానుతో సర్వం నష్ట పోయామని కౌలు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికీ పొలాల్లోంచి నీరు బయటకుపోలేదని.. తమకు ప్రభుత్వం సాయం అందించడం లేదని వాపోయారు. వైకాపానేతలు ఎవరూ పట్టించుకోవడం లేదని ఫిర్యాదు చేశారు.

రాష్ట్ర వ్యాప్త ఉద్యమం చేస్తాం

హైదరాబాద్​లో వరదల సమయంలో.. అక్కడి ప్రభుత్వం ఇంటికి 10 వేలు పరిహారం ఇచ్చింది. ఇక్కడ ఎకరా పొలం మునిగితే అంతే మొత్తం ఇస్తున్నారు. తుపానుతో రైతులందరూ తీవ్రంగా నష్ట పోయారు. ప్రభుత్వం ఇస్తోన్న పరిహారం రైతులకు ఏ మాత్రం సరిపోవడం లేదు. వైకాపా ప్రభుత్వంలో రైతులందరికీ న్యాయం జరగడం లేదు. కౌలు రైతులను ప్రభుత్వం అసలు పట్టించుకోవడం లేదు. ప్రతి రైతుకూ ఎకరాకు 25 నుంచి ౩౦ వేల పరిహారం ఇవ్వాలి. పొలం యజమానులుతో పాటు కౌలు రైతులందరికీ పరిహారం ఇవ్వాలి. రైతులకు పరిహారం పెంచకపోతే రాష్ట్రవ్యాప్త ఉద్యమం చేస్తాం. - పవన్ కల్యాణ్, జనసేన అధినేత

బర్త్​ డే పార్టీలకు వెళ్తే కరోనా రాదా?

అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న తీరుపై పవన్ కల్యాణ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. అసెంబ్లీ.. బూతులు తిట్టుకోవడం కోసం కాదని.. రైతుల సమస్యల పరిష్కారంపై చర్చలు జరపాలన్నారు. కరోనా పేరుతో అధికార పార్టీ నేతలు రైతులను కనీసం పరామర్శించలేదన్న పవన్... కరోనా ఉన్నా బర్త్ డే పార్టీలు మాత్రం చేసుకుంటున్నారన్నారు. కృష్ణా జిల్లాలో 2.5లక్షల ఎకరాల పంటనష్టం జరిగిందని.. రైతులకు తక్షణ సహాయంగా 5-10 వేలు వెంటనే ఇవ్వాలన్నారు. ఇద్దరు కౌలు రైతులు ఆత్మహత్య చేసుకున్నారని..వారి కుటుంబానికి 5లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కౌలు రైతులను పట్టించుకోకపోతే.. ఏ స్థాయి పోరాటం చేసేందుకైనా సిద్ధమేనని పవన్ స్పష్టం చేశారు. నిపుణులతో మాట్లాడి అంచనాలు రూపొందించి.. సాయం కోసం కేంద్రానికి నివేదిక పంపిస్తామన్నారు.

పరిహారం అందించడంలో పార్టీల పేరుతో పక్షపాతం వహించొద్దని పవన్ సూచించారు. రైతులందరికీ పరిహారం అందించాలన్నారు. ఒక్కో పంటకు ఒక్కో విధమైన పర్సెంటేజీలు, గ్రేడింగ్ లేకుండా పరిహారం కోసం అంచనాలు నమోదు చేయాలన్నారు.

ఇదీ చదవండి:

జనసేనానిని కలిసిన వైకాపా ఎమ్మెల్యే పార్థసారథి తండ్రి రెడ్డయ్య

Last Updated : Dec 3, 2020, 2:40 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.