కృష్ణాజిల్లా గుడివాడలో రాయితీ ఉల్లిపాయల కోసం వినియోగదారులు బారులు తీరారు. కొన్నిరోజులుగా సబ్సిడీ ఉల్లిపాయలను రైతుబజార్లో విక్రయించారు. అయితే వినియోగదారులు అధిక సంఖ్యలో రావటంతో... మంగళవారం మధ్యాహ్నం నుంచి పంపిణీ స్థలాన్ని ఎన్టీఆర్ క్రీడా మైదానానికి మార్చారు. పురుషులకు, మహిళలకు వేర్వేరుగా కౌంటర్లు పెట్టి విక్రయిస్తున్నారు. ఒక్కొక్క లైనులో కిలోమీటరు పైన ప్రజలు బారులు తీరారు.
ఇవీ చదవండి..