ETV Bharat / state

ఆలివ్‌రిడ్లీ తాబేళ్లకు ఏది రక్షణ..?

author img

By

Published : Dec 8, 2019, 8:39 AM IST

అరుదైన ఆలివ్‌ రిడ్లీ జాతి తాబేళ్ల ఉనికి ప్రశ్నార్థకంగా మారింది. వేల కిలోమీటర్లు ప్రయాణించే ఈ సముద్రపు తాబేళ్లు ఒడ్డుకు చేరుకునే క్రమంలో ఎన్నో ఆపదలు ఎదుర్కొంటున్నాయి. ఆ మూగజీవుల సంరక్షణకు కేంద్రప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చుచేస్తున్నా... మరణాలు మాత్రం ఆగడం లేదు.

olive redly tortoise at dangerous zone
ప్రమాదకర స్థితలో ఆలివ్​ రిడ్లీ తాబేళ్లు

తాబేళ్లలో ఆలివ్‌రిడ్లీ జాతి ఎంతో ప్రత్యేకం. ఆహారాన్వేషణ, గుడ్లు పెట్టడం కోసం దాదాపు 20 వేల కిలోమీటర్లు వలస వెళ్తాయి. వీటిలో 7 జాతులుండగా... 5 జాతుల తాబేళ్లు మన రాష్ట్రతీరానికి వలస వస్తాయి. మన సముద్రతీరాన జన్మించే తాబేళ్లు 10సంవత్సరాల తర్వాత మళ్లీ ఇక్కడికే వచ్చి సంతానాన్ని వృద్ధి చేసుకుంటాయి. ఇలా ఏటా లక్షలాది తాబేళ్లు ఒడిశాతో పాటు ఏపీ తీరానికి వలస వస్తాయి.

నదులు సముద్రంలో కలిసే చోటు ఆలివ్‌ రిడ్లీ జాతి తాబేళ్ల సంతానాభివృద్ధికి అనుకూలమైన ప్రాంతం. డిసెంబర్‌ నుంచి మార్చి మధ్య కాలం దీనికి ఆనువైనందునా... ఈ సమయంలోనే వలస వస్తుంటాయి. సముద్రం ఒడ్డుకు చేరుకొని గుడ్లు పెట్టి పొదుగుతాయి. అయితే ఒడ్డుకు చేరే క్రమంలో అనేక కారణాల వల్ల తాబేళ్లు మృత్యువాత పడుతున్నాయి. మర పడవల కింద ఉండే పంకలు తగిలి కొన్ని... వేటగాళ్ల వలల్లో చిక్కుకొని మరికొన్ని... ఇలా పెద్ద సంఖ్యలో తాబేళ్లు చనిపోతున్నాయి. వాటి గుడ్లు అడవి జంతువుల పాలవుతున్నాయి.

కృష్ణా, గుంటూరు జిల్లాల్లో బంగాళాఖాతానికి ఆనుకొని సుమారు 48వేల 140 ఎకరాల్లో కృష్ణా అభయారణ్యం విస్తరించి ఉంది. ఈ ప్రాంతంలోనే ఆలివ్‌రిడ్లీ తాబేళ్లు ఎక్కువగా మరణిస్తున్నాయి. కృష్ణా జిల్లా పాలకాయతిప్ప నుంచి సాగర సంగమం వరకు తిరిగే వాహనాల ధ్వనులకు తాబేళ్లు బెదిరిపోతున్నాయి. సముద్ర తాబేళ్లు గుడ్లుపెట్టే ప్రాంతాలకు, గుడ్లకు రక్షణ కల్పించడంలో నిర్లక్ష్యం నష్టతీవ్రతను పెంచుతోంది.

తాబేళ్ల సంరక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయడంతో పాటు... మత్స్యకారులకు అవగాహన కల్పించాలని పర్యావరణవేత్తలు కోరుతున్నారు.

ప్రమాదకర స్థితిలో ఆలివ్​ రిడ్లీ తాబేళ్లు

ఇదీ చదవండి

హమ్మయ్యా... ఆకలి తీర్చింది..!

తాబేళ్లలో ఆలివ్‌రిడ్లీ జాతి ఎంతో ప్రత్యేకం. ఆహారాన్వేషణ, గుడ్లు పెట్టడం కోసం దాదాపు 20 వేల కిలోమీటర్లు వలస వెళ్తాయి. వీటిలో 7 జాతులుండగా... 5 జాతుల తాబేళ్లు మన రాష్ట్రతీరానికి వలస వస్తాయి. మన సముద్రతీరాన జన్మించే తాబేళ్లు 10సంవత్సరాల తర్వాత మళ్లీ ఇక్కడికే వచ్చి సంతానాన్ని వృద్ధి చేసుకుంటాయి. ఇలా ఏటా లక్షలాది తాబేళ్లు ఒడిశాతో పాటు ఏపీ తీరానికి వలస వస్తాయి.

నదులు సముద్రంలో కలిసే చోటు ఆలివ్‌ రిడ్లీ జాతి తాబేళ్ల సంతానాభివృద్ధికి అనుకూలమైన ప్రాంతం. డిసెంబర్‌ నుంచి మార్చి మధ్య కాలం దీనికి ఆనువైనందునా... ఈ సమయంలోనే వలస వస్తుంటాయి. సముద్రం ఒడ్డుకు చేరుకొని గుడ్లు పెట్టి పొదుగుతాయి. అయితే ఒడ్డుకు చేరే క్రమంలో అనేక కారణాల వల్ల తాబేళ్లు మృత్యువాత పడుతున్నాయి. మర పడవల కింద ఉండే పంకలు తగిలి కొన్ని... వేటగాళ్ల వలల్లో చిక్కుకొని మరికొన్ని... ఇలా పెద్ద సంఖ్యలో తాబేళ్లు చనిపోతున్నాయి. వాటి గుడ్లు అడవి జంతువుల పాలవుతున్నాయి.

కృష్ణా, గుంటూరు జిల్లాల్లో బంగాళాఖాతానికి ఆనుకొని సుమారు 48వేల 140 ఎకరాల్లో కృష్ణా అభయారణ్యం విస్తరించి ఉంది. ఈ ప్రాంతంలోనే ఆలివ్‌రిడ్లీ తాబేళ్లు ఎక్కువగా మరణిస్తున్నాయి. కృష్ణా జిల్లా పాలకాయతిప్ప నుంచి సాగర సంగమం వరకు తిరిగే వాహనాల ధ్వనులకు తాబేళ్లు బెదిరిపోతున్నాయి. సముద్ర తాబేళ్లు గుడ్లుపెట్టే ప్రాంతాలకు, గుడ్లకు రక్షణ కల్పించడంలో నిర్లక్ష్యం నష్టతీవ్రతను పెంచుతోంది.

తాబేళ్ల సంరక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయడంతో పాటు... మత్స్యకారులకు అవగాహన కల్పించాలని పర్యావరణవేత్తలు కోరుతున్నారు.

ప్రమాదకర స్థితిలో ఆలివ్​ రిడ్లీ తాబేళ్లు

ఇదీ చదవండి

హమ్మయ్యా... ఆకలి తీర్చింది..!

Intro:ap_vja_25_06_mundhuvastay_maranamay_siksha_pkg_av_ap10044

కోసురు కృష్ణ మూర్తి, అవనిగడ్డ నియోజక వర్గం
సెల్.9299999511.


 యాంకర్ వాయిస్...
అక్కడికి ముందు వస్తే మరణించడమే ప్రతి పోటిలలో ముందు వచ్చిన వారికి ప్రధమ బహుమతి ఇస్తారు కాని అక్కడకి  ముందు వచ్చినవారికి మరణించడమే ప్రధమ బహుమతి ఒకటి కాదు రెండు కాదు వేల కిలోమీటర్ల దూరం ప్రయాణించి ఒడ్డుకు చేరుకునే క్రమంలో  అనేక ఆపదల వలన మృతి చెందుతున్నాయి, ఒక ప్రక్క అంతరించి పోయే ఆ జీవుల  సంరక్షణకు కేంద్ర ప్రభుత్వం వేలాది రూపాయలు ఖర్చు చేస్తున్నా వాటి మరణాలు ఆగడం లేదు ఏమిటి అని ఆసక్తిగా ఉందా ......

వాయిస్ ఓవర్.....
మానవాళికి మేలు చేసే సముద్ర జీవుల్లో తాబేళ్లను అగ్రగామిగా చెబుతారు, అలాంటి తాబేలు లేదా కూర్మము ఇవి ట్రయాసిక్ యుగం  సముద్ర తాబేళ్లు భూమి మీద ఉన్న అతి ప్రాచినమైన సరీసృపాలు (reptiles),  (24.5 కోట్ల సంవత్సరాల )  నుండి ఎలాంటి మార్పులు లేకుండా  జీవించియున్న దృడమైన పైకప్పుగల ప్రాచీన  సరీసృపాలు.  ఈ జాతి తాబేళ్లు 100 నుండి  150 సంవత్సరాలు కాలంవరకు  జీవించి ఉంటాయి, ఇవి సముద్ర సంచార జీవులు , సుమారు 20,000 కిలోమీటర్లు వరకు ఆహారం కోసం మరియు గుడ్లు పెట్టడం కోసం వలస వెళతాయి ప్రపంచ వ్యాప్తంగా ఏడు రకాల సముద్ర తాబేళ్లు జాతులు ఉన్నవి. వీటిలో అయిదు రకాలు భారత దేశంలో ఉన్నవి అందులో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ తీరప్రాంతనికి ఎక్కువగా వచ్చేవి అలీవ్ రిడ్లీ తాబేళ్లు. ఇక్కడ జన్మించిన ఈ జాతి తాబేళ్ళు క్రమం తప్పకుండా పది సంవత్సరాలకు  ఇక్కడికే వచ్చి గుడ్లు పెట్టి తమ సంతతిని  పెంపొందించుకోవటం ఈ జాతి తాబేళ్ల ప్రత్యేకత.

కృష్ణాజిల్లా, గుంటూరు జిల్లాల్లో  కృష్ణా వన్యప్రాణి అభయారణ్యం 194 కిలోమీటర్ల దూరం సుమారు  48,140 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి  బంగాళాఖాతం అనుకుని సముద్రం ఒడ్డున నెలకొనిఉన్నది.   ప్రకృతిసిద్దంగా ఉద్బవించిన  సహజ మడఅడవుల సోయగాలు, కృష్ణానది సముద్రంలో కలియుచోటు సాగర సంగమం తీరంలో  కలియు పరమ పవిత్ర ప్రదేశం   పకృతి రమణీయం లో  సముద్ర తాబేళ్లు  మృతు వాత పడుతున్నాయి.  సముద్ర తాబేళ్లు తమ సంతానాన్ని అభివృద్ధి చేసుకునెందుకు నది మరియు  సముద్రంలో కలియుప్రాంతంలో డిసెంబర్ మరియు జనవరి, పిబ్రవరి, మార్చి మాసాల్లో సముద్రం ఒడ్డుకు వచ్చి   తాబేళ్లు గుడ్లు పెట్టి పొదుగుతాయి  కృష్ణాజిల్లాలోని  పాలకాయతిప్ప , నాగాయలంక లైట్ హౌస్ , సంగమేశ్వరం ,సోర్లగొంది,  ఈలచేట్లదిబ్బ,  గుంటూరు జిల్లా , సూర్యలంక , నిజాంపట్నం  ఒడ్డుకు నిత్యం పదుల సంఖ్యలో  తాబేళ్లు మరణిస్తున్నాయి తాబేళ్లు పెట్టిన గుడ్లు నక్కలు తినివేస్తున్నాయి. అభయారణ్యంలో పాలకాయతిప్ప నుండి సాగర సంగమం వరకు  సముద్రం   ఒడ్డున యధేచ్చగా తిరిగే ఆటోల ద్వనులకు తాబేళ్లు బెదిరి పోతున్నాయి.  

సముద్ర తాబేళ్ల గుడ్లు పెట్టే ఆవాస ప్రాంతాలకు turtle Hatcher ద్వారా భద్రత కల్పించడం . తాబేళ్ల గుడ్లను సంరక్షించడానికి  రెండు పద్దతులు పాటించాలి  1. అంతర సంరక్షణ inritu conderation 2. బాహ్య సంరక్షణ మత్సకారులకు , బోటు యజమానులకు సముద్ర తాబేళ్ల సంరక్షణ పై అవగాహన కలుగజేయడం లేదు.  సముద్రంలో వేటాడే బోట్ల క్రింది భాగంలో పంకాలకు తాబేళ్ళకు తగిలి చనిపోతున్నాయి మరికొన్ని మత్స్యకారులు చేపల కోసం వేసిన వలల్లో చిక్కుకుని మరణిస్తున్నాయి, ఒడ్డుకు కొట్టుకొచ్చిన తాబేలుచుట్టు వల చుట్టుకుని ఉండటమే నిదర్శనం గా చెప్పవచ్చు.   అటవీ శాఖ వారు ఇప్పటికికైనా తాబేళ్ల సంరక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయాలనీ, మత్యకారులకు అవగాహన సదస్సులు బోట్లకు మేస్ లు ఏర్పాటు చేయాల  పర్యావరణ వేత్తలు కోరుతున్నారు.       
     


Body:వలలో చిక్కుకుని, వేటాడే బొట్లు ఫ్యాన్లకు తగిలి తాబేళ్లు మృతువాత పట్టించుకోని వన్యప్రాణి విభాగం అధికారులు


Conclusion:వలలో చిక్కుకుని, వేటాడే బొట్లు ఫ్యాన్లకు తగిలి తాబేళ్లు మృతువాత పట్టించుకోని వన్యప్రాణి విభాగం అధికారులు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.