ETV Bharat / state

అతి తీవ్ర తుపానుగా‌ నివర్: విపత్తుల శాఖ

నివర్ తుఫాను అతి తీవ్ర తుపానుగా మారనుందని విపత్తులశాఖ కమిషనర్‌ కన్నబాబు వెల్లడించారు. కడలూర్​కి తూర్పు ఆగ్నేయంలో 90 కిలోమీటర్లు, పుదుచ్చేరికి తూర్పు ఆగ్నేయంగా 150 కిలోమీటర్లు, చెన్నైకి 220 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని విపత్తుల శాఖ వెల్లడించింది.

author img

By

Published : Nov 25, 2020, 8:47 PM IST

nivar cyclone becomes very severe
అతి తీవ్ర తుపానుగా‌ నివర్

నివర్ తుపాను నైరుతి బంగాళాఖాతంలో ఇప్పటికే పెను తుపానుగా మారింది. అతి తీవ్ర తుపానుగా‌ నివర్ మారనుందని విపత్తుల శాఖ వెల్లడించింది. పుదుచ్చేరికి 150 కి.మీ., చెన్నైకు 220 కి.మీ. దూరంలో కేంద్రీకృతమైందని తెలిపింది. రేపు తెల్లవారుజామున తమిళనాడులోని మమాళ్లపురం- కరైకల్ మధ్య , పుదుచ్చేరి దగ్గరలో అతి తీవ్ర తుపానుగా‌ తీరాన్ని దాటే అవకాశం ఉందని పేర్కొంది. తీరందాటే సమయంలో దక్షిణకోస్తాంధ్ర తీరం వెంబడి గంటకు 65 - 85 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని విపత్తుల శాఖ కమిషనర్ కన్నబాబు పేర్కొన్నారు. రాత్రికి నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు పడతాయని ఆయన వెల్లడించారు. రేపు చిత్తూరు , కర్నూలు ,ప్రకాశం, కడప జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలకోసం సిద్ధంగా ఉన్నయన్నారు. ఎప్పటికప్పుడు జిల్లా అధికారులను , ప్రభుత్వ శాఖలను అప్రమత్తం చేస్తున్నామన్నారు. తుపాను ప్రభావిత ప్రాంత ప్రజలు సురక్షిత భవనాల్లో ఉండాలని సూచించారు. ఇల్లు సురక్షితం కాకపోతే సురక్షితమైన ఆశ్రయాలకు వెళ్లాలని తెలిపారు. రైతులు అప్రమత్తంగా ఉండి , పంట సంరక్షణకై తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.

నివర్ తుపాను నైరుతి బంగాళాఖాతంలో ఇప్పటికే పెను తుపానుగా మారింది. అతి తీవ్ర తుపానుగా‌ నివర్ మారనుందని విపత్తుల శాఖ వెల్లడించింది. పుదుచ్చేరికి 150 కి.మీ., చెన్నైకు 220 కి.మీ. దూరంలో కేంద్రీకృతమైందని తెలిపింది. రేపు తెల్లవారుజామున తమిళనాడులోని మమాళ్లపురం- కరైకల్ మధ్య , పుదుచ్చేరి దగ్గరలో అతి తీవ్ర తుపానుగా‌ తీరాన్ని దాటే అవకాశం ఉందని పేర్కొంది. తీరందాటే సమయంలో దక్షిణకోస్తాంధ్ర తీరం వెంబడి గంటకు 65 - 85 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని విపత్తుల శాఖ కమిషనర్ కన్నబాబు పేర్కొన్నారు. రాత్రికి నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు పడతాయని ఆయన వెల్లడించారు. రేపు చిత్తూరు , కర్నూలు ,ప్రకాశం, కడప జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలకోసం సిద్ధంగా ఉన్నయన్నారు. ఎప్పటికప్పుడు జిల్లా అధికారులను , ప్రభుత్వ శాఖలను అప్రమత్తం చేస్తున్నామన్నారు. తుపాను ప్రభావిత ప్రాంత ప్రజలు సురక్షిత భవనాల్లో ఉండాలని సూచించారు. ఇల్లు సురక్షితం కాకపోతే సురక్షితమైన ఆశ్రయాలకు వెళ్లాలని తెలిపారు. రైతులు అప్రమత్తంగా ఉండి , పంట సంరక్షణకై తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.

ఇదీ చూడండి. దూసుకొస్తున్న నివర్...అర్ధరాత్రి నుంచి ఏపీలో వర్షాలు: ఐఎండీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.