ETV Bharat / state

'వాళ్లిద్దరిని హత్య చేయాలని వైకాపా ప్రయత్నించింది' - ycp plan to kill two leaders in tdp said by nara lokesh

వైకాపా రాక్షస పాలనకు మాచర్ల ఘటన పరాకాష్ట అని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ధ్వజమెత్తారు. రాష్ట్రంలో దుర్మార్గం రాజ్యమేలుతుందన్న ఆయన... తెదేపా నాయకులు బోండా ఉమ, బుద్దా వెంకన్నపై వైకాపా రౌడీ మూకలు దాడికి పాల్పడ్డారని దుయ్యబ్టటారు.

ట్విటర్​లో మండిపడ్డ నారాలోకేశ్
ట్విటర్​లో మండిపడ్డ నారాలోకేశ్
author img

By

Published : Mar 11, 2020, 6:11 PM IST

వైకాపా పాలనపై తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్​ మండిపడ్డారు. తెదేపా నాయకులు బోండా ఉమ, బుద్దా వెంకన్నను హత్య చెయ్యడానికి వైకాపా ప్రయత్నించారని ఆయన ఆరోపించారు. హైకోర్టు న్యాయవాది కిషోర్​పై ఘోరంగా దాడి చేశారని లోకేశ్‌ మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్​లో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారన్న లోకేశ్‌... స్థానిక ఎన్నికల్లో తెదేపా అభ్యర్థులు నామినేషన్ వేయడానికీ వీలు లేదంటూ అరాచకం సృష్టిస్తున్నారని దుయ్యబట్టారు. ఆఖరికి రక్షణగా వచ్చిన పోలీసులపై వైకాపా రౌడీలు దాడి చేసే పరిస్థితి వచ్చిందని విమర్శించారు. బిహార్ కంటే దారుణమైన పరిస్థితులు ఆంధ్రప్రదేశ్​లో ఉన్నాయని లోకేశ్‌ ట్విటర్‌ ద్వారా పేర్కొన్నారు.

వైకాపా పాలనపై తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్​ మండిపడ్డారు. తెదేపా నాయకులు బోండా ఉమ, బుద్దా వెంకన్నను హత్య చెయ్యడానికి వైకాపా ప్రయత్నించారని ఆయన ఆరోపించారు. హైకోర్టు న్యాయవాది కిషోర్​పై ఘోరంగా దాడి చేశారని లోకేశ్‌ మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్​లో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారన్న లోకేశ్‌... స్థానిక ఎన్నికల్లో తెదేపా అభ్యర్థులు నామినేషన్ వేయడానికీ వీలు లేదంటూ అరాచకం సృష్టిస్తున్నారని దుయ్యబట్టారు. ఆఖరికి రక్షణగా వచ్చిన పోలీసులపై వైకాపా రౌడీలు దాడి చేసే పరిస్థితి వచ్చిందని విమర్శించారు. బిహార్ కంటే దారుణమైన పరిస్థితులు ఆంధ్రప్రదేశ్​లో ఉన్నాయని లోకేశ్‌ ట్విటర్‌ ద్వారా పేర్కొన్నారు.

ట్విటర్​లో మండిపడ్డ నారాలోకేశ్

ఇదీ చూడండి సాయంత్రంలోగా నామినేషన్లు స్వీకరించకుంటే.. ఎన్నికలు రద్దు చేయండి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.