ETV Bharat / state

ఎమ్మెల్సీ నామినేషన్లకు ఆమోదం.. ఎన్నికల నియమావళి పాటించండి : కలెక్టర్​ - mlc election news

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నామపత్రాల పరిశీలన పూర్తయింది. బరిలో నిలిచిన అభ్యర్థులందరి నామినేషన్లను ఆమోదించినట్టు కలెక్టర్​ వివేక్​నాయక్​ స్పష్టం చేశారు. అభ్యర్థులు తప్పక ఎన్నికల నియమావళిని పాటించాలని ఆయన సూచించారు.

teacher mlc nominations accepted after scrutiny by collector
ఎమ్మెల్సీ నామినేషన్ల ఆమోదం.. ఎన్నికల నియమావళి పాటించండి : కలెక్టర్​
author img

By

Published : Feb 25, 2021, 4:10 AM IST

కృష్ణా – గుంటూరు ఉపాధ్యాయ నియోజకవర్గ శాసన మండలి ఎన్నికలకు దాఖలు చేసిన నామినేషన్లన్నీ సక్రమంగా ఉన్నాయని, వాటిని ఆమోదించామని ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి, కలెక్టర్‌ వివేక్‌యాదవ్ పేర్కొన్నారు. గుంటూరు కలెక్టరేట్‌లో ఎన్నికల పరిశీలకులు కె.వి.రమణ, అభ్యర్థుల సమక్షంలో పరిశీలన చేపట్టి అభ్యంతరాలను తెలుసుకున్నారు.

ఎన్నికలకు 20 మంది నామినేషన్లు దాఖలు చేశారని కలెక్టర్ వివేక్​ యాదవ్​​ తెలిపారు. నామినేషన్లు దాఖలు చేసిన అభ్యర్థులు ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు ప్రవర్తనా నియమావళికి అతిక్రమించి ఎటువంటి కార్యక్రమాలు చేపట్టరాదని సూచించారు. నామినేషన్ల ఉప సంహరణకు ఫిబ్రవరి 26 మధ్యాహ్నం 3 గంటల వరకు అవకాశం ఉందని.. అనంతరం పోటీలో ఉన్న వారి తుది జాబితాను ప్రకటిస్తామని స్పష్టం చేశారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిపై అవగాహనకు ఫిబ్రవరి 26 మధ్యాహ్నం 3.30 గంటలకు పోటీలో ఉన్న అభ్యర్థులు, రాజకీయ పార్టీల ప్రతినిధులతో ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నట్ల తెలిపారు.

కృష్ణా – గుంటూరు ఉపాధ్యాయ నియోజకవర్గ శాసన మండలి ఎన్నికలకు దాఖలు చేసిన నామినేషన్లన్నీ సక్రమంగా ఉన్నాయని, వాటిని ఆమోదించామని ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి, కలెక్టర్‌ వివేక్‌యాదవ్ పేర్కొన్నారు. గుంటూరు కలెక్టరేట్‌లో ఎన్నికల పరిశీలకులు కె.వి.రమణ, అభ్యర్థుల సమక్షంలో పరిశీలన చేపట్టి అభ్యంతరాలను తెలుసుకున్నారు.

ఎన్నికలకు 20 మంది నామినేషన్లు దాఖలు చేశారని కలెక్టర్ వివేక్​ యాదవ్​​ తెలిపారు. నామినేషన్లు దాఖలు చేసిన అభ్యర్థులు ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు ప్రవర్తనా నియమావళికి అతిక్రమించి ఎటువంటి కార్యక్రమాలు చేపట్టరాదని సూచించారు. నామినేషన్ల ఉప సంహరణకు ఫిబ్రవరి 26 మధ్యాహ్నం 3 గంటల వరకు అవకాశం ఉందని.. అనంతరం పోటీలో ఉన్న వారి తుది జాబితాను ప్రకటిస్తామని స్పష్టం చేశారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిపై అవగాహనకు ఫిబ్రవరి 26 మధ్యాహ్నం 3.30 గంటలకు పోటీలో ఉన్న అభ్యర్థులు, రాజకీయ పార్టీల ప్రతినిధులతో ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నట్ల తెలిపారు.

ఇదీ చదవండి:

గెలుపులో నిజాయితీ ఉంటే అడ్డుకునే పనేముంది: అయ్యన్నపాత్రుడు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.