ETV Bharat / state

అమానుషం: స్కూటీపై పుల్లతో గీశాడని ఆరేళ్ల బాలుడి కాలు విరగొట్టాడు! - స్కూటీపై పుల్లతో గీశాడని ఆరేళ్ల బాలుడి కాలు విరగొట్టాడు

కృష్ణా జిల్లా అప్పనాలపేటలో అమానుష ఘటన చోటుచేసుకుంది. స్కూటీపై పుల్లతో గీశాడనే కోపంతో ఓ వ్యక్తి ఆరేళ్ల బాలుడి కాలు విరగొట్టాడు. దీంతో తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు.

స్కూటీపై పుల్లతో గీశాడని ఆరేళ్ల బాలుడి కాలు విరగొట్టాడు
స్కూటీపై పుల్లతో గీశాడని ఆరేళ్ల బాలుడి కాలు విరగొట్టాడు
author img

By

Published : Mar 20, 2022, 9:13 PM IST

స్కూటీపై పుల్లతో గీశాడనే కోపంతో ఆరేళ్ల బాలుడి కాలు విరగొట్టిన ఘటన కృష్ణాజిల్లాలో ఆలస్యంగా వెలుగు చూసింది. తిరువూరుకు చెందిన బొల్లికొండ చెన్నారావు అనే వ్యక్తి ఈనెల 18న అప్పనాలపేటకు స్కూటీపై వెళ్లాడు. అదే సమయంలో అక్కడ మిత్రులతో ఆడుకుంటున్న మిద్దె మణికంఠ.. ఆగి ఉన్న స్కూటీపై పుల్లతో గీశాడు.

అది గమనించిన చెన్నారావు కర్రతో విచక్షణారహితంగా మణికంఠను కొట్టి వెళ్లిపోయాడు. సాయంత్రం కూలీ పనుల నుంచి వచ్చిన తల్లిదండ్రులు.. నడవలేని స్థితిలో ఉన్న మణికంఠను చూసి బాలుడి మిత్రుల్ని విచారించారు. అసలు విషయం తెలిసిన తరువాత చెన్నారావును ప్రశ్నించారు. అతను దురుసుగా సమాధానమివ్వడంతో పోలీసుల్ని ఆశ్రయించారు.

స్కూటీపై పుల్లతో గీశాడనే కోపంతో ఆరేళ్ల బాలుడి కాలు విరగొట్టిన ఘటన కృష్ణాజిల్లాలో ఆలస్యంగా వెలుగు చూసింది. తిరువూరుకు చెందిన బొల్లికొండ చెన్నారావు అనే వ్యక్తి ఈనెల 18న అప్పనాలపేటకు స్కూటీపై వెళ్లాడు. అదే సమయంలో అక్కడ మిత్రులతో ఆడుకుంటున్న మిద్దె మణికంఠ.. ఆగి ఉన్న స్కూటీపై పుల్లతో గీశాడు.

అది గమనించిన చెన్నారావు కర్రతో విచక్షణారహితంగా మణికంఠను కొట్టి వెళ్లిపోయాడు. సాయంత్రం కూలీ పనుల నుంచి వచ్చిన తల్లిదండ్రులు.. నడవలేని స్థితిలో ఉన్న మణికంఠను చూసి బాలుడి మిత్రుల్ని విచారించారు. అసలు విషయం తెలిసిన తరువాత చెన్నారావును ప్రశ్నించారు. అతను దురుసుగా సమాధానమివ్వడంతో పోలీసుల్ని ఆశ్రయించారు.

ఇదీ చదవండి :

మాంసం ముక్కల గొడవ.. ఓ నిండు ప్రాణం బలి !

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.