తల్లి అంత్యక్రియలకోసం వెళ్లి ప్రమాదంలో కుమారుడు, కోడలు మరణించిన ఘటన తెలంగాణలోని వరంగల్ జిల్లా పెంచికల్పేట సమీపంలో జరిగింది. అమ్మని ఆఖరి చూపు చూసేందుకు కొడుకు, కోడలు ఖమ్మం నుంచి ఆదిలాబాద్ బయల్దేరారు. వారు ప్రయాణిస్తున్న కారు రోడ్డు ప్రమాదానికి గురై ఆ దంపతులిద్దరూ చనిపోయారు.
పెంచికల్పేట సమీపంలో కారును ఎదురుగా వస్తున్న లారీ ఢీ కొట్టగా.. చాట్ల విజయ్కుమార్- సునీత దంపతులు అక్కడికక్కడే మరణించారు. అదే కారులో ప్రయాణిస్తున్న వారి కుమార్తె మౌనిక, కారు డ్రైవర్ వర్ధన్రెడ్డిలు తీవ్రంగా గాయపడ్డారు. చికిత్స నిమిత్తం వారిని హుజూరాబాద్ ఏరియా ఆస్పత్రికి తరలించారు.పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసును దర్యాప్తు చేస్తున్నారు.