ETV Bharat / state

జగన్ రెడ్డి పాలనలో రోజుకో చెల్లెమ్మ బలైపోతుంది: నారాలోకేశ్ - గుర్ల ఘటనపై స్పందించిన లోకేశ్

జగన్మోహన్ రెడ్డి పాలనలో రోజుకో చెల్లెమ్మ బలైపోతోందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శించారు. విజ‌య‌న‌గ‌రం జిల్లా గుర్ల పోలీస్ స్టేషన్ సమీపంలో డిగ్రీ చదువుతున్న యువతి కాళ్లు, చేతులు కట్టి నోటికి ప్లాస్టర్ వేసి తుప్పల్లో పడేసిన దారుణ ఘటన తీవ్రంగా కలచివేసిందన్నారు.

గుర్ల ఘటనపై స్పందించిన లోకేశ్
గుర్ల ఘటనపై స్పందించిన లోకేశ్
author img

By

Published : Mar 1, 2021, 8:04 PM IST

  • కాళ్లు,చేతులు కట్టి నోటికి ప్లాస్టర్ వేసి తుప్పల్లో పడేసిన దారుణ ఘటన తీవ్రంగా కలచివేసింది.యువతికి మెరుగైన వైద్యం అందించాలి.దాడి చేసిన వారిని ప‌ట్టుకుని కఠినంగా శిక్షించాలి.(3/3)

    — Lokesh Nara (@naralokesh) March 1, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

జగన్ రెడ్డి పాలనలో రోజుకో చెల్లెమ్మ బలైపోతోందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ధ్వజమెత్తారు. విజ‌య‌న‌గ‌రం జిల్లాలో గుర్ల పోలీస్ స్టేషన్ సమీపంలో డిగ్రీ చదువుతున్న యువతి కాళ్లు, చేతులు కట్టి నోటికి ప్లాస్టర్ వేసి తుప్పల్లో పడేసిన దారుణ ఘటన తీవ్రంగా కలచివేసిందన్నారు. యువతికి మెరుగైన వైద్యం అందించాలని కోరిన ఆయన... బాధ్యుల్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. జగన్ బుల్లెట్ లేని గన్ అని తెలిసి మృగాళ్లు రెచ్చిపోతున్నారని మండిపడ్డారు.

పోలీస్ స్టేషన్​కి కూతవేటు దూరంలో యువతి పై అఘాయిత్యానికి పాల్పడ్డారంటే రాష్ట్రంలో ఎంత ఘోరమైన పరిస్థితులు ఉన్నాయో అర్ధమవుతోందని దుయ్యబట్టారు. లేని దిశ చట్టం ప్రకారం కేసు నమోదు చేయ్యాలని ముఖ్యమంత్రి స్వయంగా మాయమాటలు చెప్పడం వల్లే ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి

అపస్మారక స్థితిలో యువతి... పోలీసు స్టేషన్​కు సమీపంలో ఘటన!

  • కాళ్లు,చేతులు కట్టి నోటికి ప్లాస్టర్ వేసి తుప్పల్లో పడేసిన దారుణ ఘటన తీవ్రంగా కలచివేసింది.యువతికి మెరుగైన వైద్యం అందించాలి.దాడి చేసిన వారిని ప‌ట్టుకుని కఠినంగా శిక్షించాలి.(3/3)

    — Lokesh Nara (@naralokesh) March 1, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

జగన్ రెడ్డి పాలనలో రోజుకో చెల్లెమ్మ బలైపోతోందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ధ్వజమెత్తారు. విజ‌య‌న‌గ‌రం జిల్లాలో గుర్ల పోలీస్ స్టేషన్ సమీపంలో డిగ్రీ చదువుతున్న యువతి కాళ్లు, చేతులు కట్టి నోటికి ప్లాస్టర్ వేసి తుప్పల్లో పడేసిన దారుణ ఘటన తీవ్రంగా కలచివేసిందన్నారు. యువతికి మెరుగైన వైద్యం అందించాలని కోరిన ఆయన... బాధ్యుల్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. జగన్ బుల్లెట్ లేని గన్ అని తెలిసి మృగాళ్లు రెచ్చిపోతున్నారని మండిపడ్డారు.

పోలీస్ స్టేషన్​కి కూతవేటు దూరంలో యువతి పై అఘాయిత్యానికి పాల్పడ్డారంటే రాష్ట్రంలో ఎంత ఘోరమైన పరిస్థితులు ఉన్నాయో అర్ధమవుతోందని దుయ్యబట్టారు. లేని దిశ చట్టం ప్రకారం కేసు నమోదు చేయ్యాలని ముఖ్యమంత్రి స్వయంగా మాయమాటలు చెప్పడం వల్లే ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి

అపస్మారక స్థితిలో యువతి... పోలీసు స్టేషన్​కు సమీపంలో ఘటన!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.