ETV Bharat / state

సామాన్యుడికి షాకిస్తున్న కరెంటు బిల్లులు - చిక్కవరంలో కరెంటు బిల్లుల సమస్య

అసలే లాక్​డౌన్​తో పనుల్లేక... చేతిలో డబ్బుల్లేక విలవిల్లాడుతున్న సామాన్యుడికి విద్యుత్ బిల్లు మరింత భారంగా మారింది. ఎప్పుడు వందల్లో ఉండే కరెంటు బిల్లు ఇప్పుడు వేల రూపాయలు వచ్చేసరికి గగ్గోలు పెడుతున్నారు.

high current bill charges in chikkavaram
షాకిస్తున్న కరెంటు బిల్లులు
author img

By

Published : May 12, 2020, 2:21 PM IST

కరెంటు బిల్లులు సామాన్యుడి నడ్డి విరుస్తున్నాయి. కృష్ణా జిల్లా గన్నవరం మండలం చిక్కవరం గ్రామస్థులకు ప్రతి నెలా 120 నుంచి 3 వందల రూపాయల వరకు కరెంటు బిల్లు వచ్చేది. కాగా మే నెలకు 15 వందల నుంచి 2 వేలకు మించి కరెంటు బిల్లులు రావటంతో గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై విద్యుత్ శాఖ సిబ్బందిని ప్రశ్నించగా, కరెంటు బిల్లు కట్టి తీరాల్సిందేనని చెప్పారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. నెల రోజులో వంద నుంచి వేలకి కరెంటు ఏ విధంగా పెరిగిందో, సామాన్యుడికి ఒక యూనిట్ విద్యుత్​ను ఏ ధరకు ఇస్తున్నారో చెప్పాలంటూ ప్రశ్నిస్తున్నారు. తక్షణమే అధిక విద్యుత్ ధర సమస్యపై ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేస్తున్నారు.

కరెంటు బిల్లులు సామాన్యుడి నడ్డి విరుస్తున్నాయి. కృష్ణా జిల్లా గన్నవరం మండలం చిక్కవరం గ్రామస్థులకు ప్రతి నెలా 120 నుంచి 3 వందల రూపాయల వరకు కరెంటు బిల్లు వచ్చేది. కాగా మే నెలకు 15 వందల నుంచి 2 వేలకు మించి కరెంటు బిల్లులు రావటంతో గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై విద్యుత్ శాఖ సిబ్బందిని ప్రశ్నించగా, కరెంటు బిల్లు కట్టి తీరాల్సిందేనని చెప్పారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. నెల రోజులో వంద నుంచి వేలకి కరెంటు ఏ విధంగా పెరిగిందో, సామాన్యుడికి ఒక యూనిట్ విద్యుత్​ను ఏ ధరకు ఇస్తున్నారో చెప్పాలంటూ ప్రశ్నిస్తున్నారు. తక్షణమే అధిక విద్యుత్ ధర సమస్యపై ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేస్తున్నారు.

ఇదీ చదవండి: నష్టాల్లో పసుపు సాగు... పట్టించుకోరా సారూ?

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.