విజయవాడ కనకదుర్గమ్మను రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా దంపతులు దర్శించుకున్నారు. అర్చకులు ఆలయ మర్యాదలతో ప్రధాన న్యాయమూర్తికి స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనం అనంతరం పండితులు వేద ఆశీర్వచనం చేశారు. ఆలయ కార్యనిర్వహణాధికారి భ్రమరాంబ.. అమ్మవారి ప్రసాదం, శేషవస్త్రం, చిత్రపటాన్ని ప్రధాన న్యాయమూర్తికి అందజేశారు.
ఇదీ చదవండి: రాష్ట్రంలో కొత్త జిల్లాలకు కలెక్టర్లు, ఎస్పీల నియామకం