ఓ భారీ చెట్టును నరికివేయడం పట్ల స్పందించిన ఓ విద్యార్థి అధికారులకు ఫిర్యాదు చేసిన సంఘటన హైదరాబాద్ ఎస్ఆర్నగర్లో చోటు చేసుకుంది. ఫలితంగా ఎనిమిదో తరగతి విద్యార్థి శివని తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రశంసలు కురిపించారు. శివ తన నివాసం సమీపంలోనే 40 ఏళ్ల వయసున్న ఓ వేప చెట్టును ఓ వ్యక్తి నరికివేశాడు.
గమనించిన విద్యార్థి శివ టోల్ ఫ్రీ నంబర్ ద్వారా అటవీ శాఖ అధికారులకు ఫిర్యాదు చేశాడు. ఫలితంగా అధికారులు చెట్టు నరికిన వ్యక్తికి 62 వేల రూపాయలు జరిమానా విధించారు. ఈ సందర్భంగా గ్రీన్ బ్రిగేడియర్ శివను గవర్నర్ తమిళిసై రాజ్భవన్కు పిలిపించి అభినందించారు.
![ఆ విద్యార్థి తెగువ, ధైర్యం భేష్ : తెలంగాణ గవర్నర్](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10618158_865_10618158_1613243032864.png)
ఇదీ చూడండి : మరోసారి మానవత్వం చాటుకున్న మంత్రి