నందిగామ మండలం జొన్నలగడ్డ చెక్పోస్ట్ వద్ద అక్రమంగా గంజాయ తరలిస్తున్న వాహనాన్ని పోలీసులు పట్టుకున్నారు. కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి 193 కేజీల గంజాయి, ఓ కారు, రూ. 36 వేల నగదు, ఐదు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోలీసులు విచారణ చేపట్టారు. ఇందులో భాగంగా అక్రమ రవాణాకు సంబంధించిన ప్రధాన ముద్దాయిని అరెస్ట్ చేశారు. ఇతను బీదర్కి చెందిన ఎస్. భీమాగా పోలీసులు గుర్తించారు. సదరు వ్యక్తిని శుక్రవారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు పోలీసులు వెల్లడించారు.
ఇదీ చదవండి :
బ్రహ్మంగారిమఠంలో గుట్కా ప్యాకెట్లు పట్టివేత.. ముగ్గురు అరెస్టు