ETV Bharat / state

'తెదేపా కార్యకర్తలపై మంత్రి పేర్ని కేసులు పెట్టిస్తున్నారు' - మచిలీపట్నంలో తెదేపా నేతపై దాడి వైకాపా నేతల పనేనన్న మాజీ మంత్రి కొల్లు రవీంద్ర

పోలీసులు, వైకాపా నేతలపై.. మాజీ మంత్రి కొల్లు రవీంద్ర పలు విమర్శలు చేశారు. అధికార పార్టీ నేతలు అక్రమాలకు పాల్పడుతున్నా.. పోలీసులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. మంత్రి పేర్నినాని ఆదేశాలతో తెదేపా కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టి.. పోలింగ్​ బూత్​లలో ఏజెంట్లే లేకుండా చేయాలని ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు.

ex miniter kollu ravindra allegations on minister perni nani at machilipatnam
మంత్రి పేర్ని నానిపై మచిలీపట్నంలో కొల్లు రవీంద్ర విమర్శలు
author img

By

Published : Mar 10, 2021, 2:37 PM IST

మంత్రి పేర్ని నానిపై మచిలీపట్నంలో కొల్లు రవీంద్ర విమర్శలు

నగరపాలక ఎన్నికల్లో అధికార పార్టీ దౌర్జన్యాలు శ్రుతిమీరినా.. పోలీసులు చోద్యం చూస్తున్నారని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ఆరోపించారు. కృష్ణాజిల్లా మచిలీపట్నం 13వ డివిజన్‌లో ఓటు వేసేందుకు వచ్చిన తెదేపా సానుభూతిపరుడు దినకరన్‌పై కొందరు దాడిచేయడంతో జిల్లా ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స అందించేందుకు వైద్యులు ముందుకు రాకపోవడం సిగ్గుచేటని.. బాధితుడిని పరామర్శించేందుకు వచ్చిన రవీంద్ర విమర్శించారు.

పేర్నినాని ఆదేశాలతో పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని మాజీ మంత్రి ఆరోపించారు. పోలింగ్‌ ముందురోజు రాత్రి నుంచి తెదేపా ఏజెంట్లు, ముఖ్యకార్యకర్తలపై తప్పుడుకేసులు పెట్టారన్నారు. బూత్‌లలో ఏజెంట్లే లేకుండా చేయాలని చూస్తున్నారని విమర్శించారు. దాడులు చేసి ఎన్నికల్లో గెలవలేరని.. అందుకు తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు.

ఇదీ చదవండి:

ఓటు హక్కు వినియోగించుకున్న కేశినేని శ్వేత

మంత్రి పేర్ని నానిపై మచిలీపట్నంలో కొల్లు రవీంద్ర విమర్శలు

నగరపాలక ఎన్నికల్లో అధికార పార్టీ దౌర్జన్యాలు శ్రుతిమీరినా.. పోలీసులు చోద్యం చూస్తున్నారని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ఆరోపించారు. కృష్ణాజిల్లా మచిలీపట్నం 13వ డివిజన్‌లో ఓటు వేసేందుకు వచ్చిన తెదేపా సానుభూతిపరుడు దినకరన్‌పై కొందరు దాడిచేయడంతో జిల్లా ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స అందించేందుకు వైద్యులు ముందుకు రాకపోవడం సిగ్గుచేటని.. బాధితుడిని పరామర్శించేందుకు వచ్చిన రవీంద్ర విమర్శించారు.

పేర్నినాని ఆదేశాలతో పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని మాజీ మంత్రి ఆరోపించారు. పోలింగ్‌ ముందురోజు రాత్రి నుంచి తెదేపా ఏజెంట్లు, ముఖ్యకార్యకర్తలపై తప్పుడుకేసులు పెట్టారన్నారు. బూత్‌లలో ఏజెంట్లే లేకుండా చేయాలని చూస్తున్నారని విమర్శించారు. దాడులు చేసి ఎన్నికల్లో గెలవలేరని.. అందుకు తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు.

ఇదీ చదవండి:

ఓటు హక్కు వినియోగించుకున్న కేశినేని శ్వేత

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.