నేరచరిత్ర కలిగి ప్రత్యర్థి నాయకులు చేసే మాయలకు మోసపోవద్దని మంత్రి దేవినేని ఉమ ప్రజలను కోరారు. కృష్ణా జిల్లా మైలవరంలో చివరి రోజు తెదేపా ఎన్నికల ప్రచారానికి మంత్రి హాజరయ్యారు. హామీలు నెరవేర్చి ఏపీని సస్యశ్యామలం చేసిన తెదేపాకు ఓట్లు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు. కృష్ణా జిల్లా మైలవరంలో ఎన్నికల ప్రచారం చేపట్టారు. కార్యకర్తలతో పాటు సైకిల్ తొక్కుతూ ్భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెదేపా కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఇదీ చదవండి