విజయవాడ శివారు ప్రాంతమైన నున్న వద్ద పోలవరం కాలువలో గుర్తుతెలియని మహిళ మృతదేహం కొట్టుకు వచ్చింది. ఆదివారం కొంత వరదనీరు కాలువలోకి వచ్చి చేరింది. ఎగువ నుంచి వచ్చిన ఆ నీటిలోనే మృతదేహం కొట్టుకు వచ్చినట్లు స్ధానికులు చెబుతున్నారు. మృతురాలికి సుమారు 30 ఏళ్లు ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. సంఘటన స్ధలానికి చేరుకున్న నున్న గ్రామీణ పోలీసులు, క్లూస్ టీం మహిళ మృతదేహాన్ని కాల్వ నుంచి బయటకు తీసి… కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చదవండి: భవన నిర్మాణాల్లో ఈసీబీసీ అమలుచేయాలి