ETV Bharat / state

క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్టు.. రూ.5.24 లక్షలు స్వాధీనం

author img

By

Published : Apr 22, 2021, 5:18 PM IST

కృష్ణా జిల్లా మచిలీపట్నంలో క్రికెట్ బెట్టింగ్​లకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు ఆరెస్టు చేశారు. ఆరుగురు ప్రధాన నిందితులతోపాటు 12 మంది సహచర నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నారు.

Cricket Bookies Arrest at krishna district
క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్టు

క్రికెట్ బెట్టింగ్​లకు పాల్పడుతున్న ముఠాను కృష్ణా జిల్లా మచిలీపట్నం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్‌బాబు తెలిపిన వివరాల ప్రకారం... ఇనగుదురుపేట స్టేషన్‌ పరిధిలోని గొడుగుపేటలో ఓ ఇంట్లో క్రికెట్ పందేలు నిర్వహిస్తున్నారనే సమాచారం మేరకు పోలీసులు మెరుపుదాడి చేశారు.

ఆరుగురు ప్రధాన నిందితులతోపాటు 12 మంది సహచర నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నామన్నారు. వారి వద్ద నుంచి 5 లక్షల 24 వేల నగదుతో పాటు 12 సెల్‌ఫోన్‌లు, పందేల నిర్వహణకు ఉపయోగిస్తున్న టీవీ, ఇతర పరికరాలను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ వెల్లడించారు.

క్రికెట్ బెట్టింగ్​లకు పాల్పడుతున్న ముఠాను కృష్ణా జిల్లా మచిలీపట్నం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్‌బాబు తెలిపిన వివరాల ప్రకారం... ఇనగుదురుపేట స్టేషన్‌ పరిధిలోని గొడుగుపేటలో ఓ ఇంట్లో క్రికెట్ పందేలు నిర్వహిస్తున్నారనే సమాచారం మేరకు పోలీసులు మెరుపుదాడి చేశారు.

ఆరుగురు ప్రధాన నిందితులతోపాటు 12 మంది సహచర నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నామన్నారు. వారి వద్ద నుంచి 5 లక్షల 24 వేల నగదుతో పాటు 12 సెల్‌ఫోన్‌లు, పందేల నిర్వహణకు ఉపయోగిస్తున్న టీవీ, ఇతర పరికరాలను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ వెల్లడించారు.

ఇదీచదవండి

కరోనా వ్యాప్తి నియంత్రణంలో ప్రభుత్వ తీరుపై హైకోర్టు అసహనం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.