విద్యుత్ బిల్లుల రీడింగ్లో లోపాలు జరిగాయంటూ ఆందోళనకు దిగిన విజయవాడ అజిత్సింగ్ నగర్ వాసులకు సీపీఎం నేత సీహెచ్ బాబురావు మద్దతు తెలిపారు. స్థానికులతో కలిసి అజిత్సింగ్ నగర్ విద్యుత్ స్టేషన్ వద్ద ఆందోళన నిర్వహించారు. విద్యుత్ బిల్లులో తేడాలు సరి చేయాలని డిమాండ్ చేశారు. ఏప్రిల్ నెల నుంచి అమల్లోకి వచ్చిన కొత్త విద్యుత్ టారిఫ్ అమలును నిలిపివేయాలని కోరారు. పెనాల్టీలు, కస్టమర్ ఛార్జీలు రద్దు చేయాలన్నారు. 2 వందల యూనిట్ల లోపు విద్యుత్ వినియోగించే వారందరికీ పూర్తిగా విద్యుత్ ఛార్జీలను మూడు నెలల పాటు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సింగ్ నగర్, వించిపేటలో పేదలకు ఆహారాన్ని పంపిణీ చేశారు.
ఇదీ చదవండి: నష్టాల్లో పసుపు సాగు... పట్టించుకోరా సారూ?