ETV Bharat / state

అర్హులకు టిడ్కో ఇళ్లు కేటాయించాలని సీపీఐ రాష్ట్ర స్థాయి సదస్సు - CPI state level conference news

టిడ్కో నివాసాలను కేటాయించాలంటూ సీపీఐ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి సదస్సు నిర్వహించారు. నిర్మాణం పూరైన ఇళ్లను పంపిణీ చేసేందుకు ప్రభుత్వం ఎందుకు ఆలస్యం చేస్తుందో అర్థం కావట్లేదంటూ సీపీఐ నేతలు అన్నారు.

CPI state level conference
సీపీఐ రాష్ట్ర స్థాయి సదస్సు
author img

By

Published : Dec 21, 2020, 8:57 PM IST

అర్హులకు టిడ్కో గృహాలను కేటాయించాలంటూ సీపీఐ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి సదస్సు నిర్వహించారు. కృష్ణాజిల్లా విజయవాడలోని దాసరి భవన్​లో ఈ కార్యక్రమం జరిగింది. నిర్మాణం పూరైన ఇళ్లను పంపిణీ చేసేందుకు ప్రభుత్వం ఎందుకు ఆలస్యం చేస్తుందంటూ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ప్రశ్నించారు. పేదలను ముఖ్యమంత్రి చిన్నచూపు చూస్తున్నారని ఆయన అన్నారు.

పట్టణాల్లో సెంటు స్థలం ఇస్తామంటున్న ప్రభుత్వం.. ఆ కొంచెం భూమిలో నివాసయోగ్యమైన ఇంటిని ఎలా నిర్మిస్తారని నిలదీశారు. దాదాపు ఏడు లక్షల మంది లబ్ధిదారులు ఉంటే 2 లక్షల 60 వేల మందికి మాత్రమే ఇళ్లు ఇవ్వడమేమిటని ఆయన ప్రశ్నించారు. టిడ్కో గృహ సముదాయాల దగ్గర సరైన సౌకర్యాలు కల్పించాలని కోరారు. పట్టణాల్లో రెండు సెంట్లు, గ్రామాల్లో మూడు సెంట్ల స్థలం ఇవ్వాలని డిమాండ్ చేశారు.

అర్హులకు టిడ్కో గృహాలను కేటాయించాలంటూ సీపీఐ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి సదస్సు నిర్వహించారు. కృష్ణాజిల్లా విజయవాడలోని దాసరి భవన్​లో ఈ కార్యక్రమం జరిగింది. నిర్మాణం పూరైన ఇళ్లను పంపిణీ చేసేందుకు ప్రభుత్వం ఎందుకు ఆలస్యం చేస్తుందంటూ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ప్రశ్నించారు. పేదలను ముఖ్యమంత్రి చిన్నచూపు చూస్తున్నారని ఆయన అన్నారు.

పట్టణాల్లో సెంటు స్థలం ఇస్తామంటున్న ప్రభుత్వం.. ఆ కొంచెం భూమిలో నివాసయోగ్యమైన ఇంటిని ఎలా నిర్మిస్తారని నిలదీశారు. దాదాపు ఏడు లక్షల మంది లబ్ధిదారులు ఉంటే 2 లక్షల 60 వేల మందికి మాత్రమే ఇళ్లు ఇవ్వడమేమిటని ఆయన ప్రశ్నించారు. టిడ్కో గృహ సముదాయాల దగ్గర సరైన సౌకర్యాలు కల్పించాలని కోరారు. పట్టణాల్లో రెండు సెంట్లు, గ్రామాల్లో మూడు సెంట్ల స్థలం ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి: 'బ్లాక్​ చెయిన్​'తో గిన్నీస్​కెక్కిన బెజవాడ యువతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.