రాష్ట్రంలో ఇవాళ మరోసారి కరోనా వ్యాక్సినేషన్ డ్రైరన్ ప్రక్రియ నిర్వహించారు. ప్రభుత్వం ఎంపిక చేసిన కేంద్రాల్లో డ్రై రన్ ఏర్పాటు చేశారు. కడపజిల్లాలోని 108 వైద్య కేంద్రాలు, గుంటూరులోని నరసరావుపేట, కృష్ణా జిల్లా నందిగామలోని ప్రభుత్వాస్పత్రిలో డ్రైరన్ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేశారు. తొలుత టీకా వేయించుకునే వారికి వైద్యులు వ్యాక్సినేషన్ తీరుపై సూచనలు, సలహాలు ఇచ్చారు. టీకా వేసిన అరగంటసేపు పరిశీలన గదిలో ఉంచి.. ఎలాంటి ఇబ్బంది లేదని తెలిసాకే ఇంటికి పంపించినట్లు వైద్యులు తెలిపారు.
ఇదీ చదవండి: కృష్ణా తీరంలో 9 ఆలయాల పునర్నిర్మాణానికి సీఎం శంకుస్థాపన