ETV Bharat / state

కాంగ్రెస్ నాయకుడు వేల్పుల పరమేశ్వరరావు గుండెపోటుతో మృతి - Congress party in-charge dies of heart attack

నందిగామ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్​ఛార్జి వేల్పుల పరమేశ్వరరావు గుండెపోటుతో మృతి చెందారు. అందరితో ఆప్యాయంగా ఉంటూ.. ప్రజా సమస్యలపై పోరాటం చేసే వెల్పుల మృతి అందరినీ కలిచివేసింది.

Congress party in-charge dies of heart attack
కాంగ్రెస్ నాయకుడు వేల్పుల పరమేశ్వరరావు గుండెపోటుతో మృతి
author img

By

Published : Dec 21, 2020, 3:22 PM IST

కృష్ణా జిల్లా నందిగామ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్​ఛార్జి వేల్పుల పరమేశ్వరరావు గుండెపోటుతో మృతి చెందారు. స్థానిక పశు వైద్యశాల ఆవరణలో మాట్లాడుతుండగా.. గుండెపోటుతో ఒక్కసారిగా కుప్పకూలారు. ఆసుపత్రికి తరలించే లోపే కన్నుమూశారు.

పరమేశ్వరరావు నందిగామ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా రెండు సార్లు పోటీ చేసి ఓడిపోయారు. చందర్లపాడు మండలం జిల్లా పరిషత్ సభ్యుడిగా ఐదేళ్లు పని చేశారు. నందిగామ కోర్టులో సీనియర్ న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. పరమేశ్వరరావు మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. అందరితో ఆప్యాయంగా ఉంటూ ప్రజా సమస్యలపై పోరాడే వెల్పుల మృతి అందరినీ కలిచివేసింది.

ఇదీ చదవండి:

అప్పుల్లో, ఖర్చుల్లో ఏపీదే తొలిస్థానం.. కాగ్ లెక్కల్లో వెల్లడి

కృష్ణా జిల్లా నందిగామ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్​ఛార్జి వేల్పుల పరమేశ్వరరావు గుండెపోటుతో మృతి చెందారు. స్థానిక పశు వైద్యశాల ఆవరణలో మాట్లాడుతుండగా.. గుండెపోటుతో ఒక్కసారిగా కుప్పకూలారు. ఆసుపత్రికి తరలించే లోపే కన్నుమూశారు.

పరమేశ్వరరావు నందిగామ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా రెండు సార్లు పోటీ చేసి ఓడిపోయారు. చందర్లపాడు మండలం జిల్లా పరిషత్ సభ్యుడిగా ఐదేళ్లు పని చేశారు. నందిగామ కోర్టులో సీనియర్ న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. పరమేశ్వరరావు మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. అందరితో ఆప్యాయంగా ఉంటూ ప్రజా సమస్యలపై పోరాడే వెల్పుల మృతి అందరినీ కలిచివేసింది.

ఇదీ చదవండి:

అప్పుల్లో, ఖర్చుల్లో ఏపీదే తొలిస్థానం.. కాగ్ లెక్కల్లో వెల్లడి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.