ETV Bharat / state

కరోనా దృష్ట్యా మోపిదేవిలో ఆలయం మూసివేత - 'కరోనా దృష్ట్యా మోపిదేవి ఆలయం మూసివేత'

కరోనా వైరస్ ప్రభావంతో కృష్ణాజిల్లా మోపిదేవి మండంలంలోని శ్రీవల్లి, దేవసేనా సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానాన్ని మూసివేస్తున్నట్లు ఆలయ అధికారి జి.వి.డి.యన్. లీలా కుమార్ తెలిపారు.

'మోపిదేవి ఆలయంలో ఆర్జిత సేవలు నిలుపుదల'
'మోపిదేవి ఆలయంలో ఆర్జిత సేవలు నిలుపుదల'
author img

By

Published : Mar 20, 2020, 4:30 PM IST

Updated : Mar 20, 2020, 9:52 PM IST

కరోనా దృష్ట్యా మోపిదేవిలో ఆలయం మూసివేత

కరోనా వైరస్ ప్రభావం వలన అధికారులు ముందు జాగ్రత్త చర్యలు చేపడుతున్నారు. కృష్ణాజిల్లా మోపిదేవి గ్రామంలో శ్రీ వల్లీ, దేవసేనా సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవస్థానం మూసివేస్తున్నట్లు ఆలయాధికారులు తెలిపారు. భక్తులకు కల్పించే అన్ని రకాల దర్శనాలు, పూజలు నిలిపివేస్తున్నామన్నారు. భక్తులకు ఆలయంలోకి అనుమతి ఉండదని అన్నారు. భక్తులు సహకరించవలసినదిగా ఆలయ అధికారి జి.వి.డి.యన్. లీలా కుమార్ విజ్ఞప్తి చేాశారు. ఆలయం మూసి ఉన్నప్పటికీ స్వామివారికి ప్రతిరోజు జరిపే నిత్య కైంకర్యాలు యథావిధిగా జరుగుతాయన్నారు. ప్రభుత్వం, దేవాదాయశాఖ అధికారుల ఆదేశాల మేరకు భక్తులకు స్వామివారి దర్శనం కల్పించే తేదీ తెలియజేస్తామని అన్నారు.

ఇవీ చదవండి

కరోనా ఎఫెక్ట్: పాలకాయతిప్ప బీచ్​ గేట్లు మూసివేత

కరోనా దృష్ట్యా మోపిదేవిలో ఆలయం మూసివేత

కరోనా వైరస్ ప్రభావం వలన అధికారులు ముందు జాగ్రత్త చర్యలు చేపడుతున్నారు. కృష్ణాజిల్లా మోపిదేవి గ్రామంలో శ్రీ వల్లీ, దేవసేనా సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవస్థానం మూసివేస్తున్నట్లు ఆలయాధికారులు తెలిపారు. భక్తులకు కల్పించే అన్ని రకాల దర్శనాలు, పూజలు నిలిపివేస్తున్నామన్నారు. భక్తులకు ఆలయంలోకి అనుమతి ఉండదని అన్నారు. భక్తులు సహకరించవలసినదిగా ఆలయ అధికారి జి.వి.డి.యన్. లీలా కుమార్ విజ్ఞప్తి చేాశారు. ఆలయం మూసి ఉన్నప్పటికీ స్వామివారికి ప్రతిరోజు జరిపే నిత్య కైంకర్యాలు యథావిధిగా జరుగుతాయన్నారు. ప్రభుత్వం, దేవాదాయశాఖ అధికారుల ఆదేశాల మేరకు భక్తులకు స్వామివారి దర్శనం కల్పించే తేదీ తెలియజేస్తామని అన్నారు.

ఇవీ చదవండి

కరోనా ఎఫెక్ట్: పాలకాయతిప్ప బీచ్​ గేట్లు మూసివేత

Last Updated : Mar 20, 2020, 9:52 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.