ETV Bharat / state

ప్రారంభం కాని సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాలు.. రైతులకు దక్కని మద్దతు ధర - కృష్ణా జిల్లా సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాలు

కృష్ణా జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాకపోవడం వల్ల రైతులు నష్టపోతున్నారు. వారికి మద్దతు ధర దక్కడంలేదు. బహిరంగ మార్కెట్​లో వ్యాపారులకు తక్కువ ధరకు అమ్ముకోవాల్సి వస్తోందని రైతన్నలు వాపోతున్నారు.

cci cotton purchase centres
ప్రారంభం కాని సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాలు
author img

By

Published : Nov 19, 2020, 6:50 PM IST

కృష్ణాజిల్లాలోని నందిగామ, మైలవరం, కంచికచర్ల మార్కెట్ యార్డులో సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాలు ఇంకా ప్రారంభించకపోవడం వల్ల రైతులకు మద్దతు ధర దక్కడంలేదు. పత్తిని గుంటూరులోని జిన్నింగ్ మిల్లు వద్దకు తీసుకువస్తేనే కొనుగోలు చేస్తామని.. స్థానికంగా యార్డుల్లో కొనమని చెప్తున్నందున అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు.

ఆయా ప్రాంతాల నుంచి గుంటూరు మిల్లు వద్దకు పత్తి తీసుకువెళ్లాలంటే రవాణా ఖర్చులు అదనంగా అవుతాయని రైతులంటున్నారు. వీటిని భరించాలంటే తమకు కష్టమవుతుందని వాపోతున్నారు. పత్తికి సీసీఐ మద్దతు ధర క్వింటాకు రూ. 5825 ఉండగా.. కేంద్రాలు ప్రారంభం కాకపోవడం వల్ల రైతులకు ఆ ధర దక్కడంలేదు. బహిరంగ మార్కెట్లో వ్యాపారులు నాణ్యతను బట్టి క్వింటా రూ. 4 వేల నుంచి రూ. 4,500 వరకు కొంటున్నారు. ఈ ఏడాది అధిక వర్షాల వల్ల పంట దిగుబడి తగ్గిందని.. దానికితోడు సీసీఐ మద్దతు ధర అందక మరింత నష్టపోతున్నామని రైతన్నలు వాపోతున్నారు. యార్డుల వద్ద పంటను కొనుగోలు చేయాలని కోరుతున్నారు.

కృష్ణాజిల్లాలోని నందిగామ, మైలవరం, కంచికచర్ల మార్కెట్ యార్డులో సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాలు ఇంకా ప్రారంభించకపోవడం వల్ల రైతులకు మద్దతు ధర దక్కడంలేదు. పత్తిని గుంటూరులోని జిన్నింగ్ మిల్లు వద్దకు తీసుకువస్తేనే కొనుగోలు చేస్తామని.. స్థానికంగా యార్డుల్లో కొనమని చెప్తున్నందున అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు.

ఆయా ప్రాంతాల నుంచి గుంటూరు మిల్లు వద్దకు పత్తి తీసుకువెళ్లాలంటే రవాణా ఖర్చులు అదనంగా అవుతాయని రైతులంటున్నారు. వీటిని భరించాలంటే తమకు కష్టమవుతుందని వాపోతున్నారు. పత్తికి సీసీఐ మద్దతు ధర క్వింటాకు రూ. 5825 ఉండగా.. కేంద్రాలు ప్రారంభం కాకపోవడం వల్ల రైతులకు ఆ ధర దక్కడంలేదు. బహిరంగ మార్కెట్లో వ్యాపారులు నాణ్యతను బట్టి క్వింటా రూ. 4 వేల నుంచి రూ. 4,500 వరకు కొంటున్నారు. ఈ ఏడాది అధిక వర్షాల వల్ల పంట దిగుబడి తగ్గిందని.. దానికితోడు సీసీఐ మద్దతు ధర అందక మరింత నష్టపోతున్నామని రైతన్నలు వాపోతున్నారు. యార్డుల వద్ద పంటను కొనుగోలు చేయాలని కోరుతున్నారు.

ఇవీ చదవండి..

పిల్లలతో ఉపాధి హామీ పనులు...

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.