ETV Bharat / state

CBN: దేవినేని శ్రీమన్నారాయణ పార్థివదేహానికి చంద్రబాబు నివాళి

దేవినేని ఉమ తండ్రి పార్థివదేహానికి తెదేపా అధినేత చంద్రబాబు నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

author img

By

Published : Dec 3, 2021, 1:58 PM IST

Updated : Dec 3, 2021, 2:15 PM IST

cbn-tribute-to-devineni-uma-father
దేవినేని శ్రీమన్నారాయణ పార్థివదేహానికి చంద్రబాబు నివాళులు

తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నేత దేవినేని ఉమ తండ్రి పార్థివదేహానికి పలువురు ప్రముఖులు నివాళులు అర్పించారు. కృష్ణా జిల్లా కంచికచర్లలోని ఉమ స్వగృహంలో శ్రీమన్నారాయణ పార్థివదేహాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచారు. శ్రీమన్నారాయణ పార్థివదేహాన్ని తెలుగుదేశం అధినేత చంద్రబాబు సందర్శించి నివాళులు అర్పించారు. దేవినేని ఉమ కుటుంబసభ్యుల్ని పరామర్శించారు.

దేవినేని శ్రీమన్నారాయణ పార్థివదేహానికి చంద్రబాబు నివాళులు

శ్రీమన్నారాయణతో తన అనుబంధాన్ని గుర్తుచేసుకున్న చంద్రబాబు.. ఉమ కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. అలాగే తెదేపా జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేశ్ ట్విట్టర్ ద్వారా సంతాపం వ్యక్తం చేశారు.

గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ధూళిపాళ్ల నరేంద్ర, కొల్లు రవీంద్ర, పట్టాభి, వసంత నాగేశ్వరరావు సహా పలువురు తెలుగుదేశం నాయకులు శ్రీమన్నారాయణకు నివాళులు అర్పించారు. వైకాపా ఎమ్మెల్యేలు వసంతకృష్ణ ప్రసాద్‌, మొండితోక జగన్‌మోహన్‌రావు శ్రీమన్నారాయణకు నివాళులు అర్పించి.. దేవినేని ఉమను పరామర్శించారు.

సంబంధిత కథనం:

DEVINENI UMA FATHER DIED : మాజీ మంత్రి దేవినేని ఉమకు పితృవియోగం

తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నేత దేవినేని ఉమ తండ్రి పార్థివదేహానికి పలువురు ప్రముఖులు నివాళులు అర్పించారు. కృష్ణా జిల్లా కంచికచర్లలోని ఉమ స్వగృహంలో శ్రీమన్నారాయణ పార్థివదేహాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచారు. శ్రీమన్నారాయణ పార్థివదేహాన్ని తెలుగుదేశం అధినేత చంద్రబాబు సందర్శించి నివాళులు అర్పించారు. దేవినేని ఉమ కుటుంబసభ్యుల్ని పరామర్శించారు.

దేవినేని శ్రీమన్నారాయణ పార్థివదేహానికి చంద్రబాబు నివాళులు

శ్రీమన్నారాయణతో తన అనుబంధాన్ని గుర్తుచేసుకున్న చంద్రబాబు.. ఉమ కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. అలాగే తెదేపా జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేశ్ ట్విట్టర్ ద్వారా సంతాపం వ్యక్తం చేశారు.

గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ధూళిపాళ్ల నరేంద్ర, కొల్లు రవీంద్ర, పట్టాభి, వసంత నాగేశ్వరరావు సహా పలువురు తెలుగుదేశం నాయకులు శ్రీమన్నారాయణకు నివాళులు అర్పించారు. వైకాపా ఎమ్మెల్యేలు వసంతకృష్ణ ప్రసాద్‌, మొండితోక జగన్‌మోహన్‌రావు శ్రీమన్నారాయణకు నివాళులు అర్పించి.. దేవినేని ఉమను పరామర్శించారు.

సంబంధిత కథనం:

DEVINENI UMA FATHER DIED : మాజీ మంత్రి దేవినేని ఉమకు పితృవియోగం

Last Updated : Dec 3, 2021, 2:15 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.