కేంద్రం స్పందించి రాజధానిపై ప్రకటన చేయాలి : రైతుల వినతిపత్రం - ap capital farmers news
భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ను విజయవాడలో రాజధాని ప్రాంత రైతులు కలిశారు. కేంద్రం స్పందించి రాజధానిపై ప్రకటన చేయాలని వినతిపత్రం అందజేశారు. రాంమాధవ్ సానుకూలంగా స్పందించారని రైతులు తెలిపారు. అవసరమైతే ప్రధాని మోదీ, అమిత్షాను కలిసే ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చినట్లు రైతులు చెప్పారు. ప్రభుత్వం ఇచ్చే 40 వేల రూపాయలతో ఎలా బతకాలో ముఖ్యమంత్రి జగన్ చెప్పాలని.... రాజధానిపై స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు.
farmers
By
Published : Oct 30, 2019, 3:59 PM IST
|
Updated : Oct 30, 2019, 5:14 PM IST
కేంద్రం స్పందించి రాజధానిపై ప్రకటన చేయాలి : రైతుల వినతిపత్రం
.
కేంద్రం స్పందించి రాజధానిపై ప్రకటన చేయాలి : రైతుల వినతిపత్రం
.
Intro:Ap_vja_32_30_captal_Farmers_Meet_Bjp_Leaders_av_Ap10052 Sai babu : 9849803586 యాంకర్: విజయవాడ అజిత్ సింగ్ నగర్ లో నూతనంగా ఏర్పాటుచేసిన భాజపా కార్యాలయాన్ని ఆ పార్టీ జాతీయ కార్యదర్శి రామ్ మాధవ్ ప్రారంభించారు.. ఈ కార్యక్రమ అనంతరం రామ్ మాధవ్ ను కలిసిన రాజధాని రైతులు తమ గోడు వెళ్లబోసుకున్నారు. తమ సమస్యలపై వినతి పత్రాన్ని సమర్పించారు.. తాము రాజధాని ప్రాంతంలో ఉండి గందరగోళ పరిస్థితులకు లోనవుతున్నారని అప్పట్లో దేశ ప్రధాని మోడీ శంకుస్థాపన చేయడం తమకు నమ్మకం ఏర్పడి భూములను ప్రభుత్వం అప్పగించామని వెంటనే భారతీయ జనతా పార్టీ అగ్ర నాయకులు స్పందించి తమకు న్యాయం జరిగేలా చొరవ చూపాలని రాంమాధవ్ ను రాజధాని రైతులు కోరారు.. దీనిపై సానుకూలంగా స్పందించిన నా భజన జాతీయ నాయకుడు రామ్ మాధవ్ త్వరలో అగ్ర నాయకుల దృష్టికి రాజధాని సమస్యను తీసుకెళ్తానని రాజధాని ప్రాంత రైతులకు తమ పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.. బైట్స్ : 1 నరేంద్ర బాబు 2,యుగంధర్ 3,నరసింహారావు 4, కొమ్మినేని సత్యనారాయణ 5, ఆలూరు శ్రీనివాసరావు....