ETV Bharat / state

మహిళ హత్య కేసులో నిందితుడు అరెస్ట్ - కోడూరులో మహిళ దారుణహత్య

కృష్ణా జిల్లాలో మహిళ హత్య కేసును పోలీసులు చేధించారు. పేకాటకు బానిసైన వ్యక్తి డబ్బుల కోసం మహిళను గొంతు నులిమి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు.

Arrest
Arrest
author img

By

Published : Jun 25, 2020, 8:27 AM IST

కృష్ణ జిల్లా.. కోడూరు మండలం పరిధిలోని నక్కవానిదారి గ్రామానికి చెందిన మహిళ హత్య కేసును పోలీసులు చేధించారు. నిందితుడు అదే గ్రామానికి చెందిన అప్పికట్ల శ్రీనివాసరావుగా గుర్తించారు. అవనిగడ్డ సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్ బి.భీమేశ్వర రవికుమార్ వివరాల ప్రకారం.. 65 ఏళ్ల మట్ట వీరమ్మను.. అప్పికట్ల శ్రీనివాసరావు ఈనెల 11వ తేదీ మధ్యాహ్నం హత్యచేసినట్లు తెలిపారు. వీరమ్మ బహిర్భూమికి వెళ్లిన సమయంలో ఆమె మెడలో ఉన్న బంగారు తాడును కాజేయాలనే ఉద్దేశంతో.. గొంతు నులిమి చంపాడని వివరించారు. పేకాటకు బానిసై డబ్బుల కోసం ఈ హత్య తానే చేసినట్లు శ్రీనివాసరావు లొంగిపోయాడని పోలీసులు వివరించారు.

కృష్ణ జిల్లా.. కోడూరు మండలం పరిధిలోని నక్కవానిదారి గ్రామానికి చెందిన మహిళ హత్య కేసును పోలీసులు చేధించారు. నిందితుడు అదే గ్రామానికి చెందిన అప్పికట్ల శ్రీనివాసరావుగా గుర్తించారు. అవనిగడ్డ సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్ బి.భీమేశ్వర రవికుమార్ వివరాల ప్రకారం.. 65 ఏళ్ల మట్ట వీరమ్మను.. అప్పికట్ల శ్రీనివాసరావు ఈనెల 11వ తేదీ మధ్యాహ్నం హత్యచేసినట్లు తెలిపారు. వీరమ్మ బహిర్భూమికి వెళ్లిన సమయంలో ఆమె మెడలో ఉన్న బంగారు తాడును కాజేయాలనే ఉద్దేశంతో.. గొంతు నులిమి చంపాడని వివరించారు. పేకాటకు బానిసై డబ్బుల కోసం ఈ హత్య తానే చేసినట్లు శ్రీనివాసరావు లొంగిపోయాడని పోలీసులు వివరించారు.

ఇదీ చదవండి: రికార్డు సంఖ్యలో కరోనా పరీక్షలు.. అదే స్థాయిలో కేసులు నమోదు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.