ETV Bharat / state

WATER DISPUTES: జల వివాదంపై కేంద్రం జోక్యం చేసుకోవాలి: అఖిలపక్షం - ఏపీ, తెలంగాణ మధ్య జలవివాదం అప్​డేట్స్

కృష్ణా నదీ జలాల వినియోగం వివాదాలపై విజయవాడలో అఖిలపక్షం సమావేశమయ్యింది. సీఎం జగన్ ఉత్తరాలు రాస్తున్నారే తప్ప.. రైతులు నష్టపోతున్నారని ఆలోచించటం లేదని నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కృష్ణా నది జలాలను సాధించేందుకు.. కార్యాచరణ ప్రకటిస్తే సీఎం వెనకుండి నడుస్తామని నేతలు తెలిపారు.

water disputes between ap, telangana
కృష్ణా నదీ జలాల వినియోగం వివాదాలపై విజయవాడలో అఖిలపక్ష నేతల భేటీ..
author img

By

Published : Jul 6, 2021, 1:45 PM IST

Updated : Jul 6, 2021, 2:37 PM IST

కృష్ణా బేసిన్​లో 120 టీఎంసీల వరద జలాలను దోచేసి.. రాయలసీమ ప్రయోజనాలు మట్టుబెట్టేందుకు కేసీఆర్​ యత్నిస్తున్నారని అఖిలపక్ష నేతలు ధ్వజమెత్తారు. కృష్ణా నదీ జలాల వినియోగం వివాదాలపై విజయవాడలో అఖిలపక్ష నేతలు సమావేశమయ్యాయి. సీఎం జగన్ ఉత్తరాలు రాస్తున్నారే తప్ప.. రైతులు నష్టపోతున్నారని ఆలోచించటం లేదని నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. జల వివాదంపై కేంద్రం జోక్యం చేసుకోవాలని కోరారు. కృష్ణా నది జలాలను సాధించేందుకు.. కార్యాచరణ ప్రకటిస్తే రాజకీయ పార్టీలు సీఎం వెనకుండి నడుస్తామని అన్నారు.

"పక్కా రాజకీయాల కోసమే ఏడేళ్ల తర్వాత కేసీఆర్ ఇలా చేస్తున్నారు. రాయలసీమ ప్రయోజనాలు మట్టుబెట్టడానికి కేసీఆర్ ఇలా వ్యవహరిస్తున్నారు. ఎన్నికల్లో ఇద్దరూ సహకరించుకున్నారని అందరికీ తెలుసు. నీటి విషయంలో ఎందుకు కలిసి మాట్లాడుకోవట్లేదు. కృష్ణా నది జలాల వినియోగంపై కేంద్రం జోక్యం చేసుకోవాలి" - రామకృష్ణ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి

"కేసీఆర్ అడుగుతున్న మూడో ట్రైబ్యునల్‌ ఎక్కణ్నుంచి తీసుకురావాలి. కేఆర్‌ఎంబీ ప్రేక్షకపాత్ర వహించడం మంచిది కాదు. 120 టీఎంసీల వరద జలాలను తెలంగాణ దోచేస్తోంది. ఉత్తరాలు తప్ప.. రైతులు నష్టపోతున్నారని సీఎం ఆలోచించట్లేదు." -వడ్డే శోభనాద్రీశ్వరరావు, మాజీ మంత్రి

కృష్ణా నదీ జలాల వినియోగం వివాదాలపై విజయవాడలో అఖిలపక్ష నేతల భేటీ..

ఇదీ చదవండి:

తెలుగు రాష్ట్రాల మధ్య కొనసాగుతున్న జల వివాదం

కృష్ణా బేసిన్​లో 120 టీఎంసీల వరద జలాలను దోచేసి.. రాయలసీమ ప్రయోజనాలు మట్టుబెట్టేందుకు కేసీఆర్​ యత్నిస్తున్నారని అఖిలపక్ష నేతలు ధ్వజమెత్తారు. కృష్ణా నదీ జలాల వినియోగం వివాదాలపై విజయవాడలో అఖిలపక్ష నేతలు సమావేశమయ్యాయి. సీఎం జగన్ ఉత్తరాలు రాస్తున్నారే తప్ప.. రైతులు నష్టపోతున్నారని ఆలోచించటం లేదని నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. జల వివాదంపై కేంద్రం జోక్యం చేసుకోవాలని కోరారు. కృష్ణా నది జలాలను సాధించేందుకు.. కార్యాచరణ ప్రకటిస్తే రాజకీయ పార్టీలు సీఎం వెనకుండి నడుస్తామని అన్నారు.

"పక్కా రాజకీయాల కోసమే ఏడేళ్ల తర్వాత కేసీఆర్ ఇలా చేస్తున్నారు. రాయలసీమ ప్రయోజనాలు మట్టుబెట్టడానికి కేసీఆర్ ఇలా వ్యవహరిస్తున్నారు. ఎన్నికల్లో ఇద్దరూ సహకరించుకున్నారని అందరికీ తెలుసు. నీటి విషయంలో ఎందుకు కలిసి మాట్లాడుకోవట్లేదు. కృష్ణా నది జలాల వినియోగంపై కేంద్రం జోక్యం చేసుకోవాలి" - రామకృష్ణ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి

"కేసీఆర్ అడుగుతున్న మూడో ట్రైబ్యునల్‌ ఎక్కణ్నుంచి తీసుకురావాలి. కేఆర్‌ఎంబీ ప్రేక్షకపాత్ర వహించడం మంచిది కాదు. 120 టీఎంసీల వరద జలాలను తెలంగాణ దోచేస్తోంది. ఉత్తరాలు తప్ప.. రైతులు నష్టపోతున్నారని సీఎం ఆలోచించట్లేదు." -వడ్డే శోభనాద్రీశ్వరరావు, మాజీ మంత్రి

కృష్ణా నదీ జలాల వినియోగం వివాదాలపై విజయవాడలో అఖిలపక్ష నేతల భేటీ..

ఇదీ చదవండి:

తెలుగు రాష్ట్రాల మధ్య కొనసాగుతున్న జల వివాదం

Last Updated : Jul 6, 2021, 2:37 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.