accident: కృష్ణా జిల్లా బాపులపాడు మండలం అంపాపురం సమీపంలో.. చెన్నై-కోల్కతా జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఏలూరు నుంచి విజయవాడ వైపు వస్తున్న ఆర్టీసీ బస్సు.. ముందు వెళ్తున్న లారీని వెనుక నుంచి ఢీకొంది.
ఈ ప్రమాదంలో పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. వీరిని అంబులెన్స్లో ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో సుమారు 40 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
ఇదీ చదవండి: విశాఖ: దివీస్ పరిశ్రమలో పేలుడు.. నలుగురికి తీవ్రగాయాలు