కృష్ణా జిల్లా గన్నవరం మండలం సూరంపల్లి గ్రామంలో గుర్తుతెలియని మహిళ మృతదేహం కలకలం సృష్టించింది. గ్రామంలోని శ్రీ విజయసాయి రియల్ ఎస్టేట్ వెంచర్ సమీపంలోని పొలంలో మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. సమాచారం అందిన మేరకు ఘటనా స్థలాన్ని పరిశీలించిన గన్నవరం పోలీసులు.. ఒక సూసైడ్ లెటర్తోపాటు, పురుగుల మందు డబ్బాలు స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించారు. మృతురాలి వయసు సుమారు 45-55 ఏళ్లు ఉంటుందని అంచనా వేశారు.
"నా పేరు పి. శ్రీలక్ష్మి, నా కుమార్తెను సిద్దార్థ కాలేజ్లో ఇంజినీరింగ్ చదివించాను" అని ఆ లెటర్ లో రాసి ఉందని పోలీసులు తెలిపారు. ఆమె కూతురు.. తనకు ఇష్టం లేని పెళ్లి చేసుకుందన్న కారణంతో శ్రీలక్ష్మి ఆత్మహత్య చేసుకొని ఉంటుందని ప్రాథమికంగా చేసిన విచారణతో నిర్దారించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.