కృష్ణాజిల్లా ఉంగుటూరు మండలం తేలప్రోలు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ముందు వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని వెనుక నుంచి వచ్చిన కారు ఢీకొనడంతో ఓ వ్యక్తి మృతి చెందాడు. ప్రమాదంలో గుంటూరు జిల్లా పెదకాకానికి చెందిన రఘుపతిరెడ్డి(62) అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు. సంఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చదవండి: గుంటూరులో ఐఐటీ విద్యార్థి అనుమానాస్పద మృతి