ETV Bharat / state

అదుపుతప్పి కారు పల్టీ.. ఒకరికి స్వల్ప గాయాలు - కృష్ణా జిల్లా క్రైం వార్తలు

వేగంగా వెళ్తున్న ఓ కారు స్పీడ్ బ్రేకర్ వద్ద అదుపుతప్పి పల్టీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటన కృష్ణా జిల్లా నందిగామ బైపాస్ రోడ్డు వై జంక్షన్ సమీపంలో జరిగింది.

a car overturned at Krishna district
అదుపుతప్పి కారు పల్టీ
author img

By

Published : Jun 21, 2021, 10:47 AM IST

కృష్ణా జిల్లా నందిగామ బైపాస్ రోడ్డు వై జంక్షన్ సమీపంలో ఓ కారు పల్టీ కొట్టింది. విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్తున్న క్రమంలో స్పీడ్ బ్రేకర్ వద్ద అదుపుతప్పి ప్రమాదం జరిగింది. ఆ సమయంలో కారులో ముగ్గురు ఉండగా.. ఒకరికి స్వల్ప గాయాలయ్యాయి.

సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. జేసీబీ సహాయంతో ఆ కారును అక్కడి నుంచి తొలగించి ట్రాఫిక్​కు అంతరాయం లేకుండా చేశారు. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు తెలిపారు.

కృష్ణా జిల్లా నందిగామ బైపాస్ రోడ్డు వై జంక్షన్ సమీపంలో ఓ కారు పల్టీ కొట్టింది. విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్తున్న క్రమంలో స్పీడ్ బ్రేకర్ వద్ద అదుపుతప్పి ప్రమాదం జరిగింది. ఆ సమయంలో కారులో ముగ్గురు ఉండగా.. ఒకరికి స్వల్ప గాయాలయ్యాయి.

సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. జేసీబీ సహాయంతో ఆ కారును అక్కడి నుంచి తొలగించి ట్రాఫిక్​కు అంతరాయం లేకుండా చేశారు. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు తెలిపారు.

ఇదీ చదవండి:

స్టీల్ ప్లాంట్ నిర్వాసితులకు న్యాయం చేస్తాం: ఎంపీ అవినాష్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.