కృష్ణా జిల్లా గన్నవరం క్వారంటైన్ కేంద్రం నుంచి 60మందిని అధికారులు వారి స్వస్థలాలకు పంపించారు. 60మంది కరోనా అనుమానితులు ఆరోగ్యంగా ఉండటం, రెండు పర్యాయాలు కరోనా పరీక్షల్లో నెగెటివ్ రావటంతో వారిని అధికారులు ప్రత్యేక రవాణా ఏర్పాట్లు చేసి వారి గృహాలకు పంపించారు. కాగా ఇంట్లో సైతం స్వీయ నిర్బంధం పాటించి అధికారులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
ఇదీచదవండి.