ETV Bharat / state

కారంపూడిలో జడ్పీటీసీ ఏకగ్రీవ అభ్యర్థి మృతి - zptc candidate shaik imam saheb death news

గుంటూరు జిల్లా కారంపూడి మండలంలో ఏకగ్రీవమైన వైకాపా జడ్పీటీసీ అభ్యర్థి షేక్ ఇమామ్ సాహెబ్ గుండెపోటుతో మరణించారు. పార్టీల నేతలు ఆయన మృతికి సంతాపం తెలిపారు.

zptc candidate shaik imam saheb
జడ్పీటీసీ అభ్యర్థి షేక్ ఇమామ్ సాహెబ్ పాతచిత్రం
author img

By

Published : Apr 3, 2021, 9:16 AM IST

గుంటూరు జిల్లా కారంపూడి మండల వైకాపా జడ్పీటీసీ ఏకగ్రీవ అభ్యర్థి షేక్ ఇమామ్ సాహెబ్ గుండెపోటుతో మరణించాడు. నెల రోజుల క్రితం గుండెపోటు రాగా.. నరసారావుపేట ఆస్పత్రిలో చికిత్స పొందారు. నిన్న సాయంత్రం మరోసారి గుండెపోటుకు గురైన సాహెబ్​ను కుటుంబసభ్యులు కారంపూడిలోని ఆస్పత్రికి తీసుకెళ్లారు.

అప్పటికే సాహెబ్ మరణించినట్లు వైద్యులు తెలిపారు. మృతునికి భార్య ముంతాజ్​, కుమారుడు, కుమార్తె ఉన్నారు. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి, మండల వైకాపా నాయకులు ఆయన మృతిపై సంతాపం ప్రకటించారు.

గుంటూరు జిల్లా కారంపూడి మండల వైకాపా జడ్పీటీసీ ఏకగ్రీవ అభ్యర్థి షేక్ ఇమామ్ సాహెబ్ గుండెపోటుతో మరణించాడు. నెల రోజుల క్రితం గుండెపోటు రాగా.. నరసారావుపేట ఆస్పత్రిలో చికిత్స పొందారు. నిన్న సాయంత్రం మరోసారి గుండెపోటుకు గురైన సాహెబ్​ను కుటుంబసభ్యులు కారంపూడిలోని ఆస్పత్రికి తీసుకెళ్లారు.

అప్పటికే సాహెబ్ మరణించినట్లు వైద్యులు తెలిపారు. మృతునికి భార్య ముంతాజ్​, కుమారుడు, కుమార్తె ఉన్నారు. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి, మండల వైకాపా నాయకులు ఆయన మృతిపై సంతాపం ప్రకటించారు.

ఇదీ చదవండి:

అదుపుతప్పిన బోర్​ వెల్ లారీ: ఒకరి మృతి, ఇద్దరికి గాయాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.