ETV Bharat / state

మార్కెట్ కమిటీ ఛైర్మన్​గా ఏసురత్నం బాధ్యతల స్వీకరణ - గుంటూరు వ్యవసాయ మార్కెట్ కమిటి ఛైర్మన్​గా ఏసురత్నం

డీఐజీగా విధులు నిర్వహించిన చంద్రగిరి ఏసురత్నం... గుంటూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్​గా  బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు మేకతోటి సుచరిత, మోపిదేవి వెంకటరమణ, శ్రీరంగనాథ రాజు హాజరయ్యారు.

yesuratnam took charge as guntur agriculture market committee chairman
గుంటూరు వ్యవసాయ మార్కెట్ కమిటి ఛైర్మన్​గా ఏసురత్నం
author img

By

Published : Jan 26, 2020, 8:57 PM IST

గుంటూరు వ్యవసాయ మార్కెట్ కమిటి ఛైర్మన్​గా ఏసురత్నం

ఆసియా ఖండంలోనే అతిపెద్ద మార్కెట్​గా పేరొందిన... గుంటూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్​గా చంద్రగిరి ఏసురత్నం బాధ్యతలు చేపట్టారు. గుంటూరు మిర్చియార్డు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఆయన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి... మంత్రులు మేకతోటి సుచరిత, మోపిదేవి వెంకటరమణ రావు, శ్రీరంగనాథ రాజు, ఎంపీ శ్రీకృష్ణ దేవరాయలు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. డీఐజీగా విధులు నిర్వహించి... తక్కువ కాలంలోనే రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్న నాయకుడు చంద్రగిరి ఏసురత్నం అని మంత్రి మోపిదేవి కొనియాడారు. ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసి రైతులను ఆదుకునేలా సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారని వివరించారు. ఈ ఛైర్మన్ పదవి... ఎమ్మెల్యే స్థాయికి సమానమని అని మంత్రి శ్రీరంగనాథ రాజు వ్యాఖ్యానించారు. అన్ని మార్కెట్ యార్డ్​ల్లో... ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు అధిక ప్రాధాన్యం కల్పించిన ఘనత సీఎం జగన్​కే దక్కుతుందని మంత్రి సుచరిత పేర్కొన్నారు. వైకాపా ప్రభుత్వం రైతులకు ఎల్లప్పుడూ అండగా నిలుస్తోందని పేర్కొన్నారు.

ఇదీ చూడండి: కృష్ణా, గుంటూరులో అర్ధరాత్రి భూ ప్రకంపనలు.. ఆందోళనలో ప్రజలు

గుంటూరు వ్యవసాయ మార్కెట్ కమిటి ఛైర్మన్​గా ఏసురత్నం

ఆసియా ఖండంలోనే అతిపెద్ద మార్కెట్​గా పేరొందిన... గుంటూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్​గా చంద్రగిరి ఏసురత్నం బాధ్యతలు చేపట్టారు. గుంటూరు మిర్చియార్డు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఆయన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి... మంత్రులు మేకతోటి సుచరిత, మోపిదేవి వెంకటరమణ రావు, శ్రీరంగనాథ రాజు, ఎంపీ శ్రీకృష్ణ దేవరాయలు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. డీఐజీగా విధులు నిర్వహించి... తక్కువ కాలంలోనే రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్న నాయకుడు చంద్రగిరి ఏసురత్నం అని మంత్రి మోపిదేవి కొనియాడారు. ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసి రైతులను ఆదుకునేలా సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారని వివరించారు. ఈ ఛైర్మన్ పదవి... ఎమ్మెల్యే స్థాయికి సమానమని అని మంత్రి శ్రీరంగనాథ రాజు వ్యాఖ్యానించారు. అన్ని మార్కెట్ యార్డ్​ల్లో... ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు అధిక ప్రాధాన్యం కల్పించిన ఘనత సీఎం జగన్​కే దక్కుతుందని మంత్రి సుచరిత పేర్కొన్నారు. వైకాపా ప్రభుత్వం రైతులకు ఎల్లప్పుడూ అండగా నిలుస్తోందని పేర్కొన్నారు.

ఇదీ చూడండి: కృష్ణా, గుంటూరులో అర్ధరాత్రి భూ ప్రకంపనలు.. ఆందోళనలో ప్రజలు

AP_GNT_25_26_Mirchi_Yard_Chairman_Swearing_AVBB_AP10169 CONTRIBUTOR : ESWARACHARI , GUNTUR యాంకర్.... ఆసియా ఖండంలోనే అతిపెద్ద మార్కెట్ గా పేరుందిన గుంటూరు మిర్చియార్డు చైర్మన్ గా చంద్రగిరి ఏసురత్నం ఏసురత్నం బాధ్యతలు చేపట్టారు. గుంటూరు మిర్చియార్డు ప్రాగణంలో ఏర్పాటు చేసిన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మంత్రులు మేకతోటి సుచరిత, మోపిదేవి వెంకటరమణ రావు, రంగనాధ్ రాజు, ఎంపీ శ్రీకృష్ణ దేవరాయలు, ఎమ్మెల్యులు మద్దాలి గిరి, ముస్తాఫా, ఉండవల్లి శ్రీదేవి, అంబటి రాంబాబు, ఎమ్మెల్సీ జాంగా కృష్ణ మూర్తి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ... డిఐజిగా విధులు నిర్వహించి, తక్కువ టైమ్ లొనే రాజకీయాలలో తనదైన ముద్రవేసుకున్న నాయకుడు చంద్రగిరి ఏసురత్నం అని మంత్రి మోపిదేవి వెంకటరమణ రావు కొనియాడారు. రాష్ట్రంలో రైతులను ఆదుకోవాలని... ఎక్కడ కూడా రైత్తులు ఆందోళనకు గురౌవ్వకూడదని ప్రతి రైతుకు కిట్టుబాటు ధర రావాలని ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారన్నారు. ధరల స్థిరీకరణ ఏర్పాటు చేసి రైతులను ఆదుకోవడానికి ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారన్నారు. ప్రతి నెల రెండవ వారంలో రైతుల సమస్యల తెలుసుకొనేందుకు అనేక కార్యక్రమాలు ఏర్పాటు చేశారన్నారు. రైతు పండించిన పంటకు కనీస మద్దుతూ ధరల పట్టిక ప్రవేశపెట్టారన్నారు. కమర్షియల్ పంటలు పండే జిల్లా గుంటూరు జిల్లా అంకె మంత్రి రంగనాధ్ రాజ్ అన్నారు. అన్ని మార్కెట్ యార్డ్ లలో ఎస్సీ, ఎస్టీ, బిసిలకు అధిక ప్రాధాన్యత కల్పించారన్నారు. ముఖ్యమంత్రి జగన్ ఇచ్చిన హామీ మేరకు అన్ని వర్గాల వారికి పదవులు కేటాయించడం జరిగిందన్నారు. ఎస్సీ, ఎస్టీ మైనార్టీ లకు నేడు మంచి రోజులు వచ్చాయని హోం మంత్రి మేకతోటి సుచరిత అన్నారు. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ లు, మహిళలు చైర్మన్ లుగా చేసిన ఘనత జగన్ కి దక్కిందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు అనుగుణంగా జగన్ నామినేటెడ్ పదవులు ఇచ్చారని చెప్పారు. వైసీపీ ప్రభుత్వం ఎప్పడు రైతులకు అండగా ఉందన్నారు. బైట్.... మోపిదేవి వెంకటరమణ రావు, రాష్ట్ర మంత్రి బైట్... రంగనాధ్ రాజు, జిల్లా ఇంచార్జ్ మంత్రి బైట్.... మేకతోటి సుచరిత, హోం శాఖ మంత్రి

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.