ETV Bharat / state

ముట్టుకోకుండానే శానిటైజర్...

దేశంలో కరోనా మహమ్మారి నిశబ్దంగా తన ప్రతాపాన్ని చూపుతోంది. అధికారులు ఎప్పటికప్పుడు నివారణ చర్యలు చేపడుతూనే ఉన్నారు. తాజాగా...గుంటూరు జిల్లాలోని కలెక్టర్ కార్యాలయంలో టచ్ లెస్ శానిటైజేషన్ డిస్పెన్సెర్ మిషన్​ను జిల్లా కలెక్టర్ ఐ.శామ్యూల్ ఆనంద్ కుమార్ ప్రారంభించారు. ఈ నేపథ్యంలో...కార్యాలయ సిబ్బంది, సందర్శకులకు తగు జాగ్రత్తలు సూచించారు.

author img

By

Published : Jun 4, 2020, 9:08 AM IST

touchless sanitizer dispencer mechine launched at guntur
టచ్ లెస్ శానిటైజేషన్ డిస్పెన్సెర్ మిషన్​ను ప్రారంభిస్తున్న కలెక్టర్​

ప్రస్తుతం ఉన్న కరోనా నివారణ చర్యల్లో భాగంగా గుంటూరు జిల్లాలోని అధికారులు వినూత్న కార్యక్రమం చేపట్టారు. స్థానిక కలెక్టర్ కార్యాలయంలో టచ్ లెస్ శానిటైజేషన్ డిస్పెన్సెర్ మిషన్ ను జిల్లా కలెక్టర్ ఐ.శామ్యూల్ ఆనంద్ కుమార్ ప్రారంభించారు. కరోనా వైరస్​ను అరికట్టాలంటే కార్యాలయ ఉద్యోగులు, సిబ్బంది, సందర్శకులు తరచూ చేతులు శుభ్రపరచుకోవాలన్నారు. ఈ మిషన్... చేతులతో తాకే అవసరం లేకుండానే సెన్సార్ ద్వారా చేతుల పైకి శానిటైజర్ ను, నిర్దేశిత ప్రమాణంలో విడుదల చేస్తుందన్నారు. దీనిని ప్రతిఒక్కరు సద్వినియోగపరచుకోవాలని ఈ సందర్భంగా కలెక్టర్ కోరారు.

ప్రస్తుతం ఉన్న కరోనా నివారణ చర్యల్లో భాగంగా గుంటూరు జిల్లాలోని అధికారులు వినూత్న కార్యక్రమం చేపట్టారు. స్థానిక కలెక్టర్ కార్యాలయంలో టచ్ లెస్ శానిటైజేషన్ డిస్పెన్సెర్ మిషన్ ను జిల్లా కలెక్టర్ ఐ.శామ్యూల్ ఆనంద్ కుమార్ ప్రారంభించారు. కరోనా వైరస్​ను అరికట్టాలంటే కార్యాలయ ఉద్యోగులు, సిబ్బంది, సందర్శకులు తరచూ చేతులు శుభ్రపరచుకోవాలన్నారు. ఈ మిషన్... చేతులతో తాకే అవసరం లేకుండానే సెన్సార్ ద్వారా చేతుల పైకి శానిటైజర్ ను, నిర్దేశిత ప్రమాణంలో విడుదల చేస్తుందన్నారు. దీనిని ప్రతిఒక్కరు సద్వినియోగపరచుకోవాలని ఈ సందర్భంగా కలెక్టర్ కోరారు.

ఇదీ చదవండి


ప్రతిధ్వని: అమెరికాలో ఆగ్రహ జ్వాలలపై చర్చ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.