ETV Bharat / state

రేపల్లెలో పోలీసుల కస్టడీలో ఉన్న వ్యక్తి మృతి - man death in police custody in repalle

గుంటూరు జిల్లా రేపల్లె పట్టణ పోలీస్ స్టేషన్​లో కస్టడీలో ఉన్న ఓ వ్యక్తి మృతి చెందాడు. ఏటీ అగ్రహారానికి చెందిన రాఘవేంద్రరావు.. అనారోగ్యం కారణంగానే మరణించాడని బాపట్ల డీఎస్పీ తెలిపారు.

the-man-death-in-police-custody-at-repalle-guntur-district
రేపల్లెలో పోలీసుల కస్టడీలో ఉన్న వ్యక్తి మృతి
author img

By

Published : Sep 8, 2020, 5:04 PM IST

గుంటూరు జిల్లా ఏటీ అగ్రహారం గ్రామానికి చెందిన కటారి రాఘవేంద్ర రావును... రేపల్లె పట్టణంలోని దుకాణ యజమానులను బెదిరించి నగదు వసూలు చేస్తున్నాడన్న ఫిర్యాదుతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మంగళవారం ఉదయం రాఘవేంద్ర అస్వస్థతకు గురికాగా... చికిత్స నిమిత్తం రేపల్లె ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

ఆస్పత్రిలో చికిత్స పొందుతూ రాఘవేంద్రరావు మృతి చెందాడు. ఈ ఘటనపై బాపట్ల డీఎస్పీ శ్రీనివాసరావు దర్యాప్తు చేపట్టి అనారోగ్యం కారణంగానే రాఘవేంద్ర మృతి చెందాడని నిర్థరించారు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

గుంటూరు జిల్లా ఏటీ అగ్రహారం గ్రామానికి చెందిన కటారి రాఘవేంద్ర రావును... రేపల్లె పట్టణంలోని దుకాణ యజమానులను బెదిరించి నగదు వసూలు చేస్తున్నాడన్న ఫిర్యాదుతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మంగళవారం ఉదయం రాఘవేంద్ర అస్వస్థతకు గురికాగా... చికిత్స నిమిత్తం రేపల్లె ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

ఆస్పత్రిలో చికిత్స పొందుతూ రాఘవేంద్రరావు మృతి చెందాడు. ఈ ఘటనపై బాపట్ల డీఎస్పీ శ్రీనివాసరావు దర్యాప్తు చేపట్టి అనారోగ్యం కారణంగానే రాఘవేంద్ర మృతి చెందాడని నిర్థరించారు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

ఇదీ చదవండి:

వాణిజ్య పన్నుల శాఖ కార్యాలయంలో అనిశా సోదాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.