అమ్మ పొత్తిళ్లలో హాయిగా ఆడుకోవాల్సిన పసికందు కాలువలో విగతజీవుడై పడి ఉంది. గుంటూరు జిల్లాలోని నరసరావుపేట జరిగిన ఈ ఘటన అందర్నీ కంటతడి పెట్టిస్తోంది. పల్నాడు రోడ్డు చెక్ పోస్ట్ వీధి కాలువలో నెలలు నిండని పసికందు మృతదేహాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. బొడ్డు కూడా ఊడని పరిస్థితిలో ఉన్న బాలుణ్నిపరిశీలించి దర్యాప్తు చేపట్టారు. కాలువలో నీటి ప్రవాహం వేగంగా ఉండడంతో వేకువ జామున గుర్తు తెలియని వ్యక్తులు పసికందు మృతదేహాన్ని కాలువలో పడేసి ఉండొచ్చని అనుమానిస్తున్నారు.
ఇదీ చూడండి:దారుణం.. నీటి కుంటలో నవజాత శిశువు మృతదేహం