గుంటూరు జిల్లా నరసరావుపేట వరవకట్టలో ఆదివారం తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. నరసరావుపేట నియోజకవర్గ తెదేపా ఇంఛార్జ్ చదలవాడ అరవిందబాబు ఆధ్వర్యంలో వరవకట్ట 17వ వార్డులో మైనారిటీ ప్రజలకు కోడిగుడ్లు, బ్రెడ్లు పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ క్రమంలో అదే వార్డులోని వైకాపా శ్రేణులు తెదేపా నాయకులను అడ్డుకున్నారు. ఒక్కసారిగా ఘర్షణ వాతావరణం నెలకొంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు... ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇరు వర్గాలకు సర్దిచెప్పటంతో గొడవ సద్దుమణిగింది.
ఇదీ చదవండి