ఇసుక కొరత నివారణకు ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ.. గుంటూరులో తెదేపా నేతలు ఆందోళన చేశారు. తెలుగు యువత ఆధ్వర్యంలో లాడ్జ్ సెంటర్లో నిరసన ప్రదర్శనలు చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. సామాన్యులకు ఇసుక అందుబాటులో ఉంచడంలో ప్రభుత్వం విఫలమైందని తెదేపా నేతలు ఆరోపించారు. ఇసుక కొరత వల్ల భవన నిర్మాణ కార్మికులు ఉపాధి కోల్పోయారన్నారు. ఇసుక సరఫరా అందుబాటులోకి తీసుకురాని పక్షంలో ఆందోళనలు ఉద్ధృతం చేస్తామన్నారు.
ఇసుక కొరతపై తెలుగు యువత ఆందోళనలు
తెలుగు యువత ఆధ్వర్యంలో గుంటూరులో ఆందోళన చేపట్టారు. ఇసుక కొరత నివారణకు ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
![ఇసుక కొరతపై తెలుగు యువత ఆందోళనలు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4810885-85-4810885-1571559518480.jpg?imwidth=3840)
ఇసుక కొరత నివారణకు ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ.. గుంటూరులో తెదేపా నేతలు ఆందోళన చేశారు. తెలుగు యువత ఆధ్వర్యంలో లాడ్జ్ సెంటర్లో నిరసన ప్రదర్శనలు చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. సామాన్యులకు ఇసుక అందుబాటులో ఉంచడంలో ప్రభుత్వం విఫలమైందని తెదేపా నేతలు ఆరోపించారు. ఇసుక కొరత వల్ల భవన నిర్మాణ కార్మికులు ఉపాధి కోల్పోయారన్నారు. ఇసుక సరఫరా అందుబాటులోకి తీసుకురాని పక్షంలో ఆందోళనలు ఉద్ధృతం చేస్తామన్నారు.
ఇదీచదవండి
యాంకర్...... రాష్ట్రంలో ఇసుక కొరత నివారణకు ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ గుంటూరులో తెదేపా నేతలు ఆందోళనకు దిగారు. గుంటూరు లాడ్జ్ సెంటర్ అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. అనంతరం లాడ్జ్ సెంటర్ నుండి శంకర్ విలాస్ కూడలి వరకు ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా నిరసన ర్యాలీ చేపట్టారు. సహజసిద్ధంగా ఇసుకను సామాన్యులకు అందుబాటులో ఉంచడంలో వైసీపీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని జిల్లా అధికార ప్రతినిధి కనపర్తి శ్రీనివాసరావు ఆరోపించారు. ఇసుకను సక్రమంగా సరఫరా చేయకపోవడం వల్ల రాష్ట్రంలో లక్షలాది మంది భవన నిర్మాణ కార్మికులు పనులు లేక పస్తులు ఉండాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. ఇసుక సరఫరా లేకపోవడం వల్ల నిర్మాణ రంగం దాని అనుబంధ రంగాలు కుదలైందని తెలుగు యువత అర్బన్ అధ్యక్షుడు అశోక్ అన్నారు. ఇసుక కొరత వలన భవన నిర్మానాబ్కార్మికులుఉపాధి కోల్పోవాల్సి వచ్చిందన్నారు. తక్షణమే ప్రభుత్వం ఇసుక సరఫరా అందుబాటులోకి తీసుకురావాలని లేనియెడల ఆందోళన ఉదృతం చేస్తామని హెచ్చరించారు.
Body:బైట్....కనపర్తి శ్రీనివాసరావు, టీడీపీ జిల్లా అధికారి ప్రతినిధి
బైట్....అశోక్....తెలుగు యువత అర్బన్ అధ్యక్షుడు.
Conclusion: