ETV Bharat / state

ఎన్టీఆర్ ఇచ్చిన పిలుపుతో ప్రజల్లోకి - సరికొత్త లోగోతో టీడీపీ ఎన్నికల ప్రచార పర్వం - tdp Atchannaidu

Telugu Desam Party Election Campaign Programs: తెలుగుదేశం పిలుస్తోంది రా కదలిరా అంటూ పార్టీ ఆవిర్భావం సందర్భంగా ఎన్టీఆర్ ఇచ్చిన పిలుపు ఇది. ఆ నినాదంతోనే వచ్చే సార్వత్రిక ఎన్నికల ప్రచార పర్వంలో దూసుకెళ్లేలా టీడీపీ కార్యాచరణ రూపొందించింది. జగన్ పాలనా వైఫల్యాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లటమే లక్ష్యంగా రేపటి నుంచి వరుస కార్యక్రమాలకు అధినేత చంద్రబాబు ఈ మేర శ్రీకారం చుట్టారు. ప్రజలకు స్వర్ణయుగం టీడీపీతోనే సాధ్యమనే వాదాన్ని విస్తృతంగా తీసుకెళ్లనున్నారు. మరోవైపు చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి నిజం గెలవాలి పర్యటనలను రేపటి నుంచి పునరుద్ధరించనున్నారు.

Telugu_Desam_Party_Election_Campaign_Programs
Telugu_Desam_Party_Election_Campaign_Programs
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 2, 2024, 10:00 PM IST

Telugu Desam Party Election Campaign Programs: రాష్ట్రాన్ని చీకటిమయం చేసి ఆంధ్రప్రదేశ్​ని ఆందోళనప్రదేశ్​గా మార్చిన జగన్ పాలనకు చరమగీతం పాడదామంటూ తెలుగుదేశం అధినేత చంద్రబాబు 'రా కదలి రా!' పేరిట ఎన్నికల ప్రచార పర్వాన్ని ఉరకలెత్తించనున్నారు. దీనికి సంబంధించి తెలుగుదేశం- జనసేన ఎన్నికల గుర్తులైన సైకిల్ - గాజు గ్లాసులతో రూపొందించిన సరికొత్త లోగోను పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్​లో రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆవిష్కరించారు.

పంచాయతీ సమస్యలపై రేపు సర్పంచ్​లతో రాష్ట్ర స్థాయి సదస్సు నిర్వహించనుండగా, బీసీలకు జరిగిన అన్యాయంపై 4వ తేదీన 'జయహో బీసీ' పేరిట రాష్ట్ర స్థాయి సదస్సుకు శ్రీకారం చుట్టారు. 5వ తేదీ నుంచి 29 వరకూ అన్ని పార్లమెంట్ స్థానాల్లో చంద్రబాబు బహిరంగ సభలు నిర్వహించనున్నారు. 5వ తేదీన ఒంగోలు పార్లమెంట్ పరిధిలోని కనిగిరి నుంచి బహిరంగ సభలు ప్రారంభం కానున్నాయి. వైసీపీ నుంచి తెలుగుదేశంలోకి వచ్చేందుకు ఎంతోమంది సంపప్రదింపులు జరుపుతున్నారు. కొత్త, పాత వారి సమన్వయం కోసం ఓ కమిటీ ఇప్పటికే పనిచేస్తోందని అచ్చెన్నాయుడు తెలిపారు. విధ్వంసాలు, వైఫల్యాలు తప్ప జగన్‌ పాలనలో అభివృద్ధి అనేది భూతద్దంలో వెతికినా కనిపించదని విమర్శించారు.

మేనిఫెస్టో ప్రకటన సభ ప్రత్యేకంగా: అన్ని సభలు తెలుగుదేశం - జనసేన సంయుక్త ఆధ్వర్యంలో జరగనున్నాయి. చంద్రబాబు- పవన్ కల్యాణ్ కలిసి పాల్గొనే సభలు త్వరలోనే ప్రకటించనున్నారు. ప్రస్తుతానికి రూపొందించిన 22 పార్లమెంట్ స్థానాల షెడ్యూల్​లో విశాఖ, నరసరావుపేట, హిందూపురం పార్లమెంట్​లలో సభల నిర్వహణ షెడ్యూల్ త్వరలోనే ఖరారు కానుంది. నరసరావుపేట పార్లమెంట్ పరిధిలోని చిలకలూరుపేట, హిందూపురం పార్లమెంట్ పరిధిలోని ధర్మవరంలలో జరిగే భారీ బహిరంగ సభలకు పవన్ కల్యాణ్​ కూడా హాజరయ్యే అవకాశం ఉంది. పార్లమెంట్ స్థాయి బహిరంగ సభలతో సంబంధం లేకుండా మేనిఫెస్టో ప్రకటన సభను ప్రత్యేకంగా నిర్వహించనున్నారు.

పార్లమెంటు నియోజకవర్గాల్లో చంద్రబాబు పర్యటన - 'రా కదలిరా' పేరుతో బహిరంగ సభలు

బహిరంగ సభల షెడ్యూల్: బహిరంగ సభల షెడ్యూల్​ను పరిశీలిస్తే, ఈ నెల 5న ఒంగోలు పార్లమెంట్ పరిధిలోని కనిగిరిలో తొలి బహిరంగ సభ నిర్వహించనున్నారు. 6వ తేదీన విజయవాడ పార్లమెంట్ పరిధిలోని తిరువూరు, నర్సాపురం పార్లమెంట్ పరిధిలోని ఆచంటల్లో బహిరంగ సభలు జరుగుతాయి. 9వ తేదీన తిరుపతి పార్లమెంట్ పరిధిలోని వెంకటగిరి, నంద్యాల పార్లమెంట్ పరిధిలోని ఆళ్లగడ్డలో సభలు చేపడత్తారు. 10వ తేదీన విజయనగరం పార్లమెంట్ పరిధిలోని బొబ్బిలిలో, కాకినాడ పార్లమెంట్ పరిధిలోని తుని స్థానాల్లో బహిరంగ సభలు జరుపుతారు.

ఎన్టీఆర్​ వర్ధంతి సందర్భంగా గుడివాడలో: 18వ తేదీన ఎన్టీఆర్​ వర్ధంతి సందర్భంగా మచిలీపట్నం పార్లమెంట్ పరిధిలోని గుడివాడలో భారీ సభ నిర్వహించనున్నారు. 19వ తేదీన చిత్తూరు పార్లమెంట్ పరిధిలోని జీడీ నెల్లూరులో, కడప పార్లమెంట్ పరిథిలోని కమలాపురం నియోజకవర్గాల్లో సభలు పెడతారు. 20వ తేదీన అరకు పార్లమెంట్ పరిధిలోని అరకు వ్యాలీ, అమలాపురం పార్లమెంట్ పరిధిలోని మండపేటలో సభలు జరగనున్నాయి. 24వ తేదీన రాజంపేట పార్లమెంట్ పరిధిలోని పీలేరు, అనంతపురం పార్లమెంట్ పరిధిలోని ఉరవకొండల్లో బహిరంగ సభలు నిర్వహిస్తారు.

25న నెల్లూరు పార్లమెంట్ పరిధిలోని కోవూరు, కర్నూలు పార్లమెంట్ పరిధిలోని పత్తికొండలో సభలు చేపడతారు. 27న రాజమండ్రి పార్లమెంట్ పరిధిలోని గోపాలపురం, గుంటూరు పార్లమెంట్ పరిధిలోని పొన్నూరు నియోజకవర్గాల్లో బహిరంగ సభలు జరగనున్నాయి. 28న అనకాపల్లి పార్లమెంట్ పరిధిలోని మాడుగలలో, శ్రీకాకుళం పార్లమెంట్ పరిధిలోని టెక్కలిలో సబలు ఉంటాయి. 29 ఏలూరు పార్లమెంట్ పరిధిలోని ఉంగుటూరు, బాపట్ల పార్లమెంట్ పరిధిలోని చీరాలలో బహిరంగ సభలు ఉంటాయి.

రేపటి నుంచి నారా భువనేశ్వరి 'నిజం గెలవాలి' పర్యటనలు

Nara Bhuvaneshwari Nijam Gelavali: చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి రేపటి నుంచి నిజం గెలవాలి పర్యటనలు పునరుద్ధరించనున్నారు. రేపు విజయనగరం జిల్లా, ఈ నెల 4వ తేదీన శ్రీకాకుళం జిల్లా, 5వ తేదీన విశాఖ జిల్లాలో నారా భువనేశ్వరి పర్యటన కొనసాగనుంది. చంద్రబాబు అరెస్టు సమయంలో మనస్తాపానికి గురై చనిపోయిన కుటుంబాలను భువనేశ్వరి పరామర్శించి వారికి ధైర్యం చెప్తారు.

ఇప్పటికే పలు కుటుంబాలను ఆమె పరామర్శించగా, చంద్రబాబు బెయిల్​పై విడుదలైన సందర్భంగా పర్యటనలకు తాత్కాలిక విరామం ప్రకటించారు. ప్రతి వారం మూడు రోజుల పాటు భువనేశ్వరి పర్యటనలు కొనసాగనున్నాయి. దాదాపు 200 మంది చంద్రబాబు జైల్లో ఉన్న సమయంలో చనిపోయారని పార్టీ వర్గాలు సమాచారం సేకరించటంతో ఆయా కుటుంబాలన్నింటినీ భువనేశ్వరి పరామర్శించనున్నారు.

Nara Lokesh Meetings: పార్టీ యువనేత నారా లోకేశ్​ సైతం నియోజకవర్గ పర్యటనలకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. యువగళం పాదయాత్రలో తిరగలేకపోయిన నియోజకవర్గాల్లో లోకేశ్​ సమావేశాలు నిర్వహించేలా ప్రణాళికలు రూపొందించుకుంటున్నారు. సంక్రాంతి తర్వాత ఆయన పర్యటనలు ఉండొచ్చని పార్టీ వర్గాల సమాచారం.

చంద్రబాబుకు అరెస్టుతో మద్దతు పెరిగింది - అండగా నిలబడినవారందరికి కృతజ్ఞతలు : భువనేశ్వరి

Telugu Desam Party Election Campaign Programs: రాష్ట్రాన్ని చీకటిమయం చేసి ఆంధ్రప్రదేశ్​ని ఆందోళనప్రదేశ్​గా మార్చిన జగన్ పాలనకు చరమగీతం పాడదామంటూ తెలుగుదేశం అధినేత చంద్రబాబు 'రా కదలి రా!' పేరిట ఎన్నికల ప్రచార పర్వాన్ని ఉరకలెత్తించనున్నారు. దీనికి సంబంధించి తెలుగుదేశం- జనసేన ఎన్నికల గుర్తులైన సైకిల్ - గాజు గ్లాసులతో రూపొందించిన సరికొత్త లోగోను పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్​లో రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆవిష్కరించారు.

పంచాయతీ సమస్యలపై రేపు సర్పంచ్​లతో రాష్ట్ర స్థాయి సదస్సు నిర్వహించనుండగా, బీసీలకు జరిగిన అన్యాయంపై 4వ తేదీన 'జయహో బీసీ' పేరిట రాష్ట్ర స్థాయి సదస్సుకు శ్రీకారం చుట్టారు. 5వ తేదీ నుంచి 29 వరకూ అన్ని పార్లమెంట్ స్థానాల్లో చంద్రబాబు బహిరంగ సభలు నిర్వహించనున్నారు. 5వ తేదీన ఒంగోలు పార్లమెంట్ పరిధిలోని కనిగిరి నుంచి బహిరంగ సభలు ప్రారంభం కానున్నాయి. వైసీపీ నుంచి తెలుగుదేశంలోకి వచ్చేందుకు ఎంతోమంది సంపప్రదింపులు జరుపుతున్నారు. కొత్త, పాత వారి సమన్వయం కోసం ఓ కమిటీ ఇప్పటికే పనిచేస్తోందని అచ్చెన్నాయుడు తెలిపారు. విధ్వంసాలు, వైఫల్యాలు తప్ప జగన్‌ పాలనలో అభివృద్ధి అనేది భూతద్దంలో వెతికినా కనిపించదని విమర్శించారు.

మేనిఫెస్టో ప్రకటన సభ ప్రత్యేకంగా: అన్ని సభలు తెలుగుదేశం - జనసేన సంయుక్త ఆధ్వర్యంలో జరగనున్నాయి. చంద్రబాబు- పవన్ కల్యాణ్ కలిసి పాల్గొనే సభలు త్వరలోనే ప్రకటించనున్నారు. ప్రస్తుతానికి రూపొందించిన 22 పార్లమెంట్ స్థానాల షెడ్యూల్​లో విశాఖ, నరసరావుపేట, హిందూపురం పార్లమెంట్​లలో సభల నిర్వహణ షెడ్యూల్ త్వరలోనే ఖరారు కానుంది. నరసరావుపేట పార్లమెంట్ పరిధిలోని చిలకలూరుపేట, హిందూపురం పార్లమెంట్ పరిధిలోని ధర్మవరంలలో జరిగే భారీ బహిరంగ సభలకు పవన్ కల్యాణ్​ కూడా హాజరయ్యే అవకాశం ఉంది. పార్లమెంట్ స్థాయి బహిరంగ సభలతో సంబంధం లేకుండా మేనిఫెస్టో ప్రకటన సభను ప్రత్యేకంగా నిర్వహించనున్నారు.

పార్లమెంటు నియోజకవర్గాల్లో చంద్రబాబు పర్యటన - 'రా కదలిరా' పేరుతో బహిరంగ సభలు

బహిరంగ సభల షెడ్యూల్: బహిరంగ సభల షెడ్యూల్​ను పరిశీలిస్తే, ఈ నెల 5న ఒంగోలు పార్లమెంట్ పరిధిలోని కనిగిరిలో తొలి బహిరంగ సభ నిర్వహించనున్నారు. 6వ తేదీన విజయవాడ పార్లమెంట్ పరిధిలోని తిరువూరు, నర్సాపురం పార్లమెంట్ పరిధిలోని ఆచంటల్లో బహిరంగ సభలు జరుగుతాయి. 9వ తేదీన తిరుపతి పార్లమెంట్ పరిధిలోని వెంకటగిరి, నంద్యాల పార్లమెంట్ పరిధిలోని ఆళ్లగడ్డలో సభలు చేపడత్తారు. 10వ తేదీన విజయనగరం పార్లమెంట్ పరిధిలోని బొబ్బిలిలో, కాకినాడ పార్లమెంట్ పరిధిలోని తుని స్థానాల్లో బహిరంగ సభలు జరుపుతారు.

ఎన్టీఆర్​ వర్ధంతి సందర్భంగా గుడివాడలో: 18వ తేదీన ఎన్టీఆర్​ వర్ధంతి సందర్భంగా మచిలీపట్నం పార్లమెంట్ పరిధిలోని గుడివాడలో భారీ సభ నిర్వహించనున్నారు. 19వ తేదీన చిత్తూరు పార్లమెంట్ పరిధిలోని జీడీ నెల్లూరులో, కడప పార్లమెంట్ పరిథిలోని కమలాపురం నియోజకవర్గాల్లో సభలు పెడతారు. 20వ తేదీన అరకు పార్లమెంట్ పరిధిలోని అరకు వ్యాలీ, అమలాపురం పార్లమెంట్ పరిధిలోని మండపేటలో సభలు జరగనున్నాయి. 24వ తేదీన రాజంపేట పార్లమెంట్ పరిధిలోని పీలేరు, అనంతపురం పార్లమెంట్ పరిధిలోని ఉరవకొండల్లో బహిరంగ సభలు నిర్వహిస్తారు.

25న నెల్లూరు పార్లమెంట్ పరిధిలోని కోవూరు, కర్నూలు పార్లమెంట్ పరిధిలోని పత్తికొండలో సభలు చేపడతారు. 27న రాజమండ్రి పార్లమెంట్ పరిధిలోని గోపాలపురం, గుంటూరు పార్లమెంట్ పరిధిలోని పొన్నూరు నియోజకవర్గాల్లో బహిరంగ సభలు జరగనున్నాయి. 28న అనకాపల్లి పార్లమెంట్ పరిధిలోని మాడుగలలో, శ్రీకాకుళం పార్లమెంట్ పరిధిలోని టెక్కలిలో సబలు ఉంటాయి. 29 ఏలూరు పార్లమెంట్ పరిధిలోని ఉంగుటూరు, బాపట్ల పార్లమెంట్ పరిధిలోని చీరాలలో బహిరంగ సభలు ఉంటాయి.

రేపటి నుంచి నారా భువనేశ్వరి 'నిజం గెలవాలి' పర్యటనలు

Nara Bhuvaneshwari Nijam Gelavali: చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి రేపటి నుంచి నిజం గెలవాలి పర్యటనలు పునరుద్ధరించనున్నారు. రేపు విజయనగరం జిల్లా, ఈ నెల 4వ తేదీన శ్రీకాకుళం జిల్లా, 5వ తేదీన విశాఖ జిల్లాలో నారా భువనేశ్వరి పర్యటన కొనసాగనుంది. చంద్రబాబు అరెస్టు సమయంలో మనస్తాపానికి గురై చనిపోయిన కుటుంబాలను భువనేశ్వరి పరామర్శించి వారికి ధైర్యం చెప్తారు.

ఇప్పటికే పలు కుటుంబాలను ఆమె పరామర్శించగా, చంద్రబాబు బెయిల్​పై విడుదలైన సందర్భంగా పర్యటనలకు తాత్కాలిక విరామం ప్రకటించారు. ప్రతి వారం మూడు రోజుల పాటు భువనేశ్వరి పర్యటనలు కొనసాగనున్నాయి. దాదాపు 200 మంది చంద్రబాబు జైల్లో ఉన్న సమయంలో చనిపోయారని పార్టీ వర్గాలు సమాచారం సేకరించటంతో ఆయా కుటుంబాలన్నింటినీ భువనేశ్వరి పరామర్శించనున్నారు.

Nara Lokesh Meetings: పార్టీ యువనేత నారా లోకేశ్​ సైతం నియోజకవర్గ పర్యటనలకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. యువగళం పాదయాత్రలో తిరగలేకపోయిన నియోజకవర్గాల్లో లోకేశ్​ సమావేశాలు నిర్వహించేలా ప్రణాళికలు రూపొందించుకుంటున్నారు. సంక్రాంతి తర్వాత ఆయన పర్యటనలు ఉండొచ్చని పార్టీ వర్గాల సమాచారం.

చంద్రబాబుకు అరెస్టుతో మద్దతు పెరిగింది - అండగా నిలబడినవారందరికి కృతజ్ఞతలు : భువనేశ్వరి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.