ETV Bharat / state

'అన్నదాతలపై హత్యాయత్నం కేసులు ఎత్తివేయాలి' - రాజధాని అమరావతి వార్తలు

వైకాపా ఎమ్మెల్యే కారుపై దాడి ఘటనలో రైతులపై హత్యాయత్నం కేసులు నమోదయ్యాయి. దీనిపై ఆవేదన వ్యక్తం చేసిన తెదేపా నేతలు... గుంటూరు అర్బన్ ఎస్పీకి వినతిపత్రం అందజేశారు. రైతులపై అక్రమ కేసులు బనాయించవద్దని కోరారు.

tdp leaders met guntur urban sp
tdp leaders met guntur urban sp
author img

By

Published : Jan 9, 2020, 11:39 PM IST

'అన్నదాతలపై హత్యాయత్నం కేసులు ఎత్తివేయాలి'

మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కారుపై దాడి కేసులో రైతులపైన హత్యాయత్నం కింద కేసులు నమోదు చేయడం దారుణమని తెదేపా నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులపై నమోదు చేసిన 307 సెక్షన్ తక్షణమే తొలగించి... అరెస్ట్ చేసిన అన్నదాతలను తక్షణమే విడుదల చేయాలని కోరుతూ గుంటూరు అర్బన్ ఎస్పీకి వినతి పత్రం అందజేశారు. ఎమ్మెల్యే గన్​మెన్ దురుసుగా ప్రవర్తించడం వలనే ఎమ్మెల్యే కారుపై దాడికి యత్నించారని తెదేపా జిల్లా అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు అన్నారు. దాడిలో పాల్గొన్న వారిపైనే కేసులు నమోదు చేయాలి తప్ప... అమాయకులపైన నమోదు చేయడం సరికాదన్నారు. రాజధాని కోసం వేలాదిమంది రోడ్లపైకి వచ్చి ఆందోళన చేస్తున్న సమయంలో అక్కడికి ఎమ్మెల్యే ఎందుకు వచ్చారని మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు ప్రశ్నించారు. ఎమ్మెల్యే కావాలనే రెచ్చకొట్టేందుకే హైవే పైకి వచ్చారని ఆయన ఆరోపించారు. అరెస్టులతో ఉద్యమాన్ని అణిచివేయలేరని ఆయన వెల్లడించారు. రాజధానిపై ప్రకటన వచ్చేవరకు ఆందోళనలు కొనసాగుతాయని ఆనంద్ బాబు స్పష్టం చేశారు.

'అన్నదాతలపై హత్యాయత్నం కేసులు ఎత్తివేయాలి'

మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కారుపై దాడి కేసులో రైతులపైన హత్యాయత్నం కింద కేసులు నమోదు చేయడం దారుణమని తెదేపా నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులపై నమోదు చేసిన 307 సెక్షన్ తక్షణమే తొలగించి... అరెస్ట్ చేసిన అన్నదాతలను తక్షణమే విడుదల చేయాలని కోరుతూ గుంటూరు అర్బన్ ఎస్పీకి వినతి పత్రం అందజేశారు. ఎమ్మెల్యే గన్​మెన్ దురుసుగా ప్రవర్తించడం వలనే ఎమ్మెల్యే కారుపై దాడికి యత్నించారని తెదేపా జిల్లా అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు అన్నారు. దాడిలో పాల్గొన్న వారిపైనే కేసులు నమోదు చేయాలి తప్ప... అమాయకులపైన నమోదు చేయడం సరికాదన్నారు. రాజధాని కోసం వేలాదిమంది రోడ్లపైకి వచ్చి ఆందోళన చేస్తున్న సమయంలో అక్కడికి ఎమ్మెల్యే ఎందుకు వచ్చారని మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు ప్రశ్నించారు. ఎమ్మెల్యే కావాలనే రెచ్చకొట్టేందుకే హైవే పైకి వచ్చారని ఆయన ఆరోపించారు. అరెస్టులతో ఉద్యమాన్ని అణిచివేయలేరని ఆయన వెల్లడించారు. రాజధానిపై ప్రకటన వచ్చేవరకు ఆందోళనలు కొనసాగుతాయని ఆనంద్ బాబు స్పష్టం చేశారు.

సంబంధిత కథనం:

అమరావతిలో ఉద్రిక్తత... ఎమ్మెల్యే కారుపై రాళ్ల దాడి..

Intro:ఈశ్వరాచారి.. గుంటూరు తూర్పు... కంట్రిబ్యూటర్

యాంకర్.... మాచర్ల ఎమ్మెల్యే కారుపై దాడి కేసులో రైతుల పైన హత్య యత్నం కింద కేసులు నమోదు చేయడం దారుణమాని టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తంచేశారు. రైతుల పై నమోదు చేసిన 307 సెక్షన్ తక్షణమే తొలగించి. అరెస్ట్ చేసిన రైతులను తక్షణమే విడుదల చేయాలని కోరుతూ గుంటూరు అర్బన్ ఎస్పీ కి వినతి పత్రం అందజేశారు. ఎమ్మెల్యే గన్ మెన్ దురుసుగా ప్రవర్తించడం వలనే ఎమ్మెల్యే కారు పై దాడికి యత్నించారని టిడిపి జిల్లా అధ్యక్షుడు జివి ఆంజనేయులు అన్నారు. దాడిలో పాల్గొన్న వారిపైనే కేసులు నమోదు చేయలే తప్ప అమాయకుల పైన కేసులు నమోదు చేయడం సరికాదన్నారు. రాజధాని కోసం వేలాదిమంది రోడ్లపైకి వచ్చి ఆందోళన చేస్తుంటే అక్కడికి ఎమ్మెల్యే ఎందుకు వచ్చారని మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు ప్రశ్నించారు. ఎమ్మెల్యే కావాలనే రెచ్చకొట్టేందుకు హైవే పైకి వచ్చారని ఆయన ఆరోపించారు. అరెస్టులు తో ఉద్యమాన్ని అణిచివేయలేరని ఆయన వెల్లడించారు. రాజధాని పై ప్రకటన వచ్చేవరకు ఆందోళనలు కొనసాగుతాయని ఆనంద్ బాబు స్పష్టంచేశారు.


Body:బైట్... జివి.ఆంజనేయులు, టీడీపీ జిల్లా అధ్యక్షుడు

బైట్.... నక్కా ఆనంద్ బాబు, మాజీ మంత్రి


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.