ETV Bharat / state

'వైకాపా దౌర్జన్యాలు చేసి గెలవాలని చూస్తోంది' - వైకాపాపై తెదేపా నేత జీవీ ఆంజనేయులు ఆగ్రహం

వైకాపా చేస్తున్న దౌర్జన్యాలను చరిత్రలో ఎప్పుడూ చూడలేదని తెదేపా నేత జీవీ ఆంజనేయులు విమర్శించారు. ప్రతిపక్ష అభ్యర్థులను కనీసం నామినేషన్ వేయకుండా అడ్డుకుంటున్నారని మండిపడ్డారు.

tdp leader gv aanjaneyulu fires on ycp
వైకాపాపై జీవీ ఆంజనేయులు ఆగ్రహం
author img

By

Published : Mar 14, 2020, 12:38 PM IST

వైకాపాపై జీవీ ఆంజనేయులు ఆగ్రహం

స్థానిక సంస్థల ఎన్నికల్లో దౌర్జన్యాలతో గెలిచేందుకు వైకాపా ప్రయత్నిస్తోందని గుంటూరు జిల్లా తెదేపా అధ్యక్షులు జీవీ ఆంజనేయులు విమర్శించారు. పల్నాడు ప్రాంతంలో ముఖ్యంగా మాచర్లలో జరిగిన ఘటనలే అందుకు నిదర్శనమన్నారు. పోలీసులు, అధికారుల అండతో విపక్ష అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ఈ పరిణామాలు చూస్తుంటే రాజ్యాంగం రచించిన అంబేడ్కర్ ఆత్మ ఘోషిస్తుందని ఆవేదన చెందారు. ఇలాంటి దుర్మార్గాలు చరిత్రలో తానెప్పుడూ చూడలేదని.. ఇంత జరుగుతుంటే రాష్ట్ర ఎన్నికల సంఘం, గవర్నర్ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.

ఇవీ చదవండి.. తెదేపా అభ్యర్థి ఇంట్లోని మద్యం.. ఆ దుకాణంలోనిదే

వైకాపాపై జీవీ ఆంజనేయులు ఆగ్రహం

స్థానిక సంస్థల ఎన్నికల్లో దౌర్జన్యాలతో గెలిచేందుకు వైకాపా ప్రయత్నిస్తోందని గుంటూరు జిల్లా తెదేపా అధ్యక్షులు జీవీ ఆంజనేయులు విమర్శించారు. పల్నాడు ప్రాంతంలో ముఖ్యంగా మాచర్లలో జరిగిన ఘటనలే అందుకు నిదర్శనమన్నారు. పోలీసులు, అధికారుల అండతో విపక్ష అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ఈ పరిణామాలు చూస్తుంటే రాజ్యాంగం రచించిన అంబేడ్కర్ ఆత్మ ఘోషిస్తుందని ఆవేదన చెందారు. ఇలాంటి దుర్మార్గాలు చరిత్రలో తానెప్పుడూ చూడలేదని.. ఇంత జరుగుతుంటే రాష్ట్ర ఎన్నికల సంఘం, గవర్నర్ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.

ఇవీ చదవండి.. తెదేపా అభ్యర్థి ఇంట్లోని మద్యం.. ఆ దుకాణంలోనిదే

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.