ప్రజలు సుభిక్షంగా ఉండాలని, కరోనా నుంచి త్వరగా విముక్తి కలగాలని దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో శ్రీ సుదర్శన మహాయాగం నిర్వహించారు. చివరి రోజు దుర్గమ్మ విజయ స్వరూపిణైన రాజరాజేశ్వరీ దేవి అలంకారంలో కనిపించారు. పెద్ద సంఖ్యలో భక్తులు, మహిళలు అమ్మవారిని దర్శించుకున్నారు. పార్టీ నాయకులు, జనసైనికులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో సుదర్శన యాగం
గుంటూరు జిల్లా మంగళగిరి జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో దసరా ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. శరన్నవరాత్రుల సందర్భంగా పార్టీ కార్యాలయంలో సుదర్శన యాగం చేశారు. దేశం సుభక్షింగా ఉండాలని, కరోనా మహమ్మారి నుంచి విముక్తి కలిగించాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
![జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో సుదర్శన యాగం Sudarshan Yagam at the State Janasena Party office](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9308185-562-9308185-1603628507700.jpg?imwidth=3840)
ఉత్సవాల్లో భాగంగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో పార్టీ రాష్ట్ర కార్యదర్శి చిల్లపల్లి శ్రీనివాస్, అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేశ్, సెంట్రల్ ఆంధ్రా పార్లమెంట్ సంయుక్త కమిటీ సభ్యులు అమ్మిశెట్టి వాసు, పాకనాటి రమాదేవి తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి. గీతం వర్సిటీ కట్టడాల కూల్చివేతపై హైకోర్టు స్టే
ప్రజలు సుభిక్షంగా ఉండాలని, కరోనా నుంచి త్వరగా విముక్తి కలగాలని దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో శ్రీ సుదర్శన మహాయాగం నిర్వహించారు. చివరి రోజు దుర్గమ్మ విజయ స్వరూపిణైన రాజరాజేశ్వరీ దేవి అలంకారంలో కనిపించారు. పెద్ద సంఖ్యలో భక్తులు, మహిళలు అమ్మవారిని దర్శించుకున్నారు. పార్టీ నాయకులు, జనసైనికులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఉత్సవాల్లో భాగంగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో పార్టీ రాష్ట్ర కార్యదర్శి చిల్లపల్లి శ్రీనివాస్, అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేశ్, సెంట్రల్ ఆంధ్రా పార్లమెంట్ సంయుక్త కమిటీ సభ్యులు అమ్మిశెట్టి వాసు, పాకనాటి రమాదేవి తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి. గీతం వర్సిటీ కట్టడాల కూల్చివేతపై హైకోర్టు స్టే