ETV Bharat / state

Fake tickets: తితిదే ఛైర్మన్‌ పేరుతోనే బురిడీ... తిరుమల దర్శనం నకిలీ టికెట్లు విక్రయం

author img

By

Published : Oct 5, 2021, 2:02 PM IST

తితిదే ఛైర్మన్ పేరిట శ్రీవారి దర్శనానికి నకిలీ టికెట్లు జారీ చేశారంటూ బాధితులు గుంటూరు అర్బన్ ఎస్పీ కార్యాలయాన్ని ఆశ్రయించారు. నిందితుడిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు.  15 టికెట్ల కోసం రూ.12,500 వసూలు చేసినట్లు బాధితులు వాపోయారు. ఆధార్‌ కార్డులు పంపించగా అందరికీ టిక్కెట్లు బుక్‌ చేసినట్లు సెల్‌ఫోన్లకు సంక్షిప్త సందేశాలు పంపించాడు. అక్కడి వెళ్లాక అవి నకిలీవని చెప్పి అధికారులు దర్శనానికి అనుమతించ లేదు.

Fake tickets
Fake tickets

తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) ఛైర్మన్‌ పేరిట శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనానికి నకిలీ టిక్కెట్లు జారీ చేసి మోసం చేశారంటూ బాధితులు సోమవారం గుంటూరు అర్బన్‌ ఎస్పీ కార్యాలయాన్ని ఆశ్రయించారు. నిందితుడిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. బాధితులు తెలిపిన వివరాల మేరకు గుంటూరు వెంకటాద్రిపేటకు చెందిన నరేంద్ర ఒక బ్యాంక్‌లో పని చేస్తున్నారు. విజయవాడకు చెందిన అజయ్‌ ఫైనాన్స్‌ వ్యాపారం నిర్వహిస్తున్నారు. వారి బంధువును తిరుమలలో శ్రీవారి దర్శనానికి టిక్కెట్లు కావాలని అడిగితే అతను గుంటూరులోని నల్లపాడుకు చెందిన ఒక వ్యక్తి సెల్‌ నంబర్‌ ఇచ్చాడు.

Fake tickets
తితిదే ఛైర్మన్‌ పేరుతోనే బురిడీ

అతనికి ఫోన్‌ చేసి బ్రేక్‌ దర్శనం కావాలని కోరారు. గత నెల 15, 23వ తేదీల్లో ఖాళీలు ఉన్నాయని చెప్పాడు. ఏ తేదీన దర్శనం కావాలో చెబితే ఆ రోజు తితిదే ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి కార్యాలయం నుంచి చేయిస్తానని తెలిపాడు. మొత్తం 15 మంది కుటుంబ సభ్యులు వెళ్లడానికి 23వ తేదీన టిక్కెట్లు కావాలని చెప్పారు. ఒక్కో టిక్కెట్‌కు రూ.వెయ్యి చొప్పున మొత్తం రూ.15 వేలు అడిగాడు. తిరుమలలో ఆ టిక్కెట్‌ రూ.500 అని, తాము తీసుకోమని చెబితే 15 టిక్కెట్లు రూ.12,500లకు అంగీకరించాడు. ఫోన్‌పే, పేటీఎం ద్వారా నగదు బదిలీ చేశారు. ఆధార్‌ కార్డులు పంపించగా అందరికీ టిక్కెట్లు బుక్‌ చేసినట్లు సెల్‌ఫోన్లకు సంక్షిప్త సందేశాలు పంపించాడు. తితిదే ఛైర్మన్‌ కార్యాలయం నుంచి జారీ చేసినట్లు అందులో ఉంది. 23న తిరుమలలో సన్నిధానం అతిథిగృహం, బ్లాక్‌ నంబర్‌ 04లో చూపితే అవి నకిలీవని చెప్పి లోపలకు అనుమతించలేదు. టిక్కెట్లు విక్రయించిన వ్యక్తికి ఫోన్‌ చేసి విషయం చెబితే తితిదే ఛైర్మన్‌తో మాట్లాడి పీఆర్వోను పంపిస్తానని, ఆయన లోపలకు పంపిస్తారని చెప్పాడు. రెండు రోజుల పాటు కాలయాపన చేసి ఫోన్‌ స్విచ్‌ ఆఫ్‌ పేశాడు. ఈ విషయాన్ని అక్కడి విజిలెన్స్‌ అధికారులకు దృష్టికి తీసుకెళ్లారు. మోసం చేసినట్లు తేలడంతో గుంటూరు చేరుకున్నారు. మహిళలు, వృద్ధులు, మూడు నెలల చిన్నారితో తిరుమల వెళ్లి చాలా ఇబ్బందులు పడ్డామని, నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు ఉన్నతాధికారులను కోరామని బాధితులు చెప్పారు.

ఇదీ చదవండి

arrest: గో పరిరక్షణ సమితి సభ్యులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు

తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) ఛైర్మన్‌ పేరిట శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనానికి నకిలీ టిక్కెట్లు జారీ చేసి మోసం చేశారంటూ బాధితులు సోమవారం గుంటూరు అర్బన్‌ ఎస్పీ కార్యాలయాన్ని ఆశ్రయించారు. నిందితుడిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. బాధితులు తెలిపిన వివరాల మేరకు గుంటూరు వెంకటాద్రిపేటకు చెందిన నరేంద్ర ఒక బ్యాంక్‌లో పని చేస్తున్నారు. విజయవాడకు చెందిన అజయ్‌ ఫైనాన్స్‌ వ్యాపారం నిర్వహిస్తున్నారు. వారి బంధువును తిరుమలలో శ్రీవారి దర్శనానికి టిక్కెట్లు కావాలని అడిగితే అతను గుంటూరులోని నల్లపాడుకు చెందిన ఒక వ్యక్తి సెల్‌ నంబర్‌ ఇచ్చాడు.

Fake tickets
తితిదే ఛైర్మన్‌ పేరుతోనే బురిడీ

అతనికి ఫోన్‌ చేసి బ్రేక్‌ దర్శనం కావాలని కోరారు. గత నెల 15, 23వ తేదీల్లో ఖాళీలు ఉన్నాయని చెప్పాడు. ఏ తేదీన దర్శనం కావాలో చెబితే ఆ రోజు తితిదే ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి కార్యాలయం నుంచి చేయిస్తానని తెలిపాడు. మొత్తం 15 మంది కుటుంబ సభ్యులు వెళ్లడానికి 23వ తేదీన టిక్కెట్లు కావాలని చెప్పారు. ఒక్కో టిక్కెట్‌కు రూ.వెయ్యి చొప్పున మొత్తం రూ.15 వేలు అడిగాడు. తిరుమలలో ఆ టిక్కెట్‌ రూ.500 అని, తాము తీసుకోమని చెబితే 15 టిక్కెట్లు రూ.12,500లకు అంగీకరించాడు. ఫోన్‌పే, పేటీఎం ద్వారా నగదు బదిలీ చేశారు. ఆధార్‌ కార్డులు పంపించగా అందరికీ టిక్కెట్లు బుక్‌ చేసినట్లు సెల్‌ఫోన్లకు సంక్షిప్త సందేశాలు పంపించాడు. తితిదే ఛైర్మన్‌ కార్యాలయం నుంచి జారీ చేసినట్లు అందులో ఉంది. 23న తిరుమలలో సన్నిధానం అతిథిగృహం, బ్లాక్‌ నంబర్‌ 04లో చూపితే అవి నకిలీవని చెప్పి లోపలకు అనుమతించలేదు. టిక్కెట్లు విక్రయించిన వ్యక్తికి ఫోన్‌ చేసి విషయం చెబితే తితిదే ఛైర్మన్‌తో మాట్లాడి పీఆర్వోను పంపిస్తానని, ఆయన లోపలకు పంపిస్తారని చెప్పాడు. రెండు రోజుల పాటు కాలయాపన చేసి ఫోన్‌ స్విచ్‌ ఆఫ్‌ పేశాడు. ఈ విషయాన్ని అక్కడి విజిలెన్స్‌ అధికారులకు దృష్టికి తీసుకెళ్లారు. మోసం చేసినట్లు తేలడంతో గుంటూరు చేరుకున్నారు. మహిళలు, వృద్ధులు, మూడు నెలల చిన్నారితో తిరుమల వెళ్లి చాలా ఇబ్బందులు పడ్డామని, నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు ఉన్నతాధికారులను కోరామని బాధితులు చెప్పారు.

ఇదీ చదవండి

arrest: గో పరిరక్షణ సమితి సభ్యులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.